EC: జమ్మూ కాశ్మీర్లో ఈసీ పర్యటన..తర్వలో ఎన్నికల తేదీ ప్రకటన
- జమ్మూ కాశ్మీర్లో ఊపందుకున్న ఎన్నికల సన్నాహాలు
- ఆగస్ట్ 8-10 వరకు ఎన్నికల సంఘం పర్యటన
- ఎన్నికలు నిర్వహించేందుకు సెప్టెంబర్ 30వ తేదీని డెడ్ లైన్ గా నిర్ణయించిన సుప్రీంకోర్టు
- తర్వలో ఎన్నికల తేదీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో వచ్చే వారం ఎన్నికల సంఘం జమ్మూకశ్మీర్లో పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఆగస్ట్ 8-10 వరకు ఈ పర్యటన జరగనుంది. ఈ సమయంలో ఆయన వెంట ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎస్ఎస్ సంధు కూడా ఉన్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు సెప్టెంబర్ 30వ తేదీని సుప్రీంకోర్టు డెడ్లైన్గా నిర్ణయించడం గమనార్హం. గత మార్చిలో, కేంద్ర పాలిత ప్రాంతాన్ని సందర్శించిన ముగ్గురు సభ్యుల కమిషన్లో కుమార్ మాత్రమే ఉన్నారు. జమ్మూకశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం జమ్మూకశ్మీర్లోని రాజకీయ పార్టీలకు, ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ సమయంలో రెండు ఎన్నికల కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మార్చి 16న లోక్సభ ఎన్నికల ప్రకటనకు కొద్ది రోజుల ముందు అవి భర్తీ అయ్యాయి.
READ MORE: Ministry of Environment: వయనాడ్ ప్రమాదం తర్వాత కేంద్రం అలర్ట్.. 6 రాష్ట్రాలకు గ్రీన్ ప్రొటెక్షన్!
Also Read
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన పవన్ కళ్యాణ్..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
జమ్మూ కాశ్మీర్లో లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో చురుకైన భాగస్వామ్యం త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భారీ సానుకూలాంశమని , ప్రధాన ఎన్నికల కమిషనర్ అన్నారు. ఈ పర్యటన బృందం శ్రీనగర్లో కమిషన్ ముందుగా రాజకీయ పార్టీలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, సెంట్రల్ ఫోర్సెస్ కోఆర్డినేటర్తో సమీక్ష జరుగుతుంది. కమిషన్ అన్ని జిల్లాల రిటర్నింగ్ అధికారులు, పోలీసు సూపరింటెండెంట్లతో పాటు ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లతో సన్నద్ధతను సమీక్షిస్తుంది. సమీక్ష ప్రక్రియపై మీడియాకు వివరించేందుకు కమిషన్ జమ్మూలో విలేకరుల సమావేశాన్ని కూడా నిర్వహించనుంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి.
READ MORE: Ministry of Environment: వయనాడ్ ప్రమాదం తర్వాత కేంద్రం అలర్ట్.. 6 రాష్ట్రాలకు గ్రీన్ ప్రొటెక్షన్!
జమ్మూకశ్మీర్లో ఎన్నికల కసరత్తు సాధారణంగా నెల రోజుల పాటు ఉంటుంది. డీలిమిటేషన్ కసరత్తు తర్వాత, పాక్ ఆక్రమిత కాశ్మీర్కు కేటాయించిన సీట్లను మినహాయించింది. ప్రస్తుతం అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. సెప్టెంబర్ 30లోగా జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని గత డిసెంబర్లో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలని తాజా సూచనను ఇస్తూ.. ఎన్నికల సంఘం కేంద్ర పాలిత ప్రాంత పరిపాలనను వారి సొంత జిల్లాల్లో నియమించిన అధికారులను బదిలీ చేయాలని కోరింది. ఎన్నికలకు ముందే కమిషన్ ఈ చర్య తీసుకుంది. ఎన్నికలకు వెళ్లే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులను వారి సొంత జిల్లాలకు లేదా వారు దీర్ఘకాలంగా పనిచేస్తున్న ప్రాంతాలకు పోస్టింగ్ చేయకూడదనే విధానాన్ని కమిషన్ స్థిరంగా అనుసరిస్తోంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన పవన్ కళ్యాణ్..
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..