EC: జమ్మూ కాశ్మీర్లో ఈసీ పర్యటన..తర్వలో ఎన్నికల తేదీ ప్రకటన
- జమ్మూ కాశ్మీర్లో ఊపందుకున్న ఎన్నికల సన్నాహాలు
- ఆగస్ట్ 8-10 వరకు ఎన్నికల సంఘం పర్యటన
- ఎన్నికలు నిర్వహించేందుకు సెప్టెంబర్ 30వ తేదీని డెడ్ లైన్ గా నిర్ణయించిన సుప్రీంకోర్టు
- తర్వలో ఎన్నికల తేదీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో వచ్చే వారం ఎన్నికల సంఘం జమ్మూకశ్మీర్లో పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఆగస్ట్ 8-10 వరకు ఈ పర్యటన జరగనుంది. ఈ సమయంలో ఆయన వెంట ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎస్ఎస్ సంధు కూడా ఉన్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు సెప్టెంబర్ 30వ తేదీని సుప్రీంకోర్టు డెడ్లైన్గా నిర్ణయించడం గమనార్హం. గత మార్చిలో, కేంద్ర పాలిత ప్రాంతాన్ని సందర్శించిన ముగ్గురు సభ్యుల కమిషన్లో కుమార్ మాత్రమే ఉన్నారు. జమ్మూకశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం జమ్మూకశ్మీర్లోని రాజకీయ పార్టీలకు, ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ సమయంలో రెండు ఎన్నికల కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మార్చి 16న లోక్సభ ఎన్నికల ప్రకటనకు కొద్ది రోజుల ముందు అవి భర్తీ అయ్యాయి.
READ MORE: Ministry of Environment: వయనాడ్ ప్రమాదం తర్వాత కేంద్రం అలర్ట్.. 6 రాష్ట్రాలకు గ్రీన్ ప్రొటెక్షన్!
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
జమ్మూ కాశ్మీర్లో లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో చురుకైన భాగస్వామ్యం త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భారీ సానుకూలాంశమని , ప్రధాన ఎన్నికల కమిషనర్ అన్నారు. ఈ పర్యటన బృందం శ్రీనగర్లో కమిషన్ ముందుగా రాజకీయ పార్టీలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, సెంట్రల్ ఫోర్సెస్ కోఆర్డినేటర్తో సమీక్ష జరుగుతుంది. కమిషన్ అన్ని జిల్లాల రిటర్నింగ్ అధికారులు, పోలీసు సూపరింటెండెంట్లతో పాటు ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లతో సన్నద్ధతను సమీక్షిస్తుంది. సమీక్ష ప్రక్రియపై మీడియాకు వివరించేందుకు కమిషన్ జమ్మూలో విలేకరుల సమావేశాన్ని కూడా నిర్వహించనుంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి.
READ MORE: Ministry of Environment: వయనాడ్ ప్రమాదం తర్వాత కేంద్రం అలర్ట్.. 6 రాష్ట్రాలకు గ్రీన్ ప్రొటెక్షన్!
జమ్మూకశ్మీర్లో ఎన్నికల కసరత్తు సాధారణంగా నెల రోజుల పాటు ఉంటుంది. డీలిమిటేషన్ కసరత్తు తర్వాత, పాక్ ఆక్రమిత కాశ్మీర్కు కేటాయించిన సీట్లను మినహాయించింది. ప్రస్తుతం అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. సెప్టెంబర్ 30లోగా జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని గత డిసెంబర్లో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలని తాజా సూచనను ఇస్తూ.. ఎన్నికల సంఘం కేంద్ర పాలిత ప్రాంత పరిపాలనను వారి సొంత జిల్లాల్లో నియమించిన అధికారులను బదిలీ చేయాలని కోరింది. ఎన్నికలకు ముందే కమిషన్ ఈ చర్య తీసుకుంది. ఎన్నికలకు వెళ్లే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులను వారి సొంత జిల్లాలకు లేదా వారు దీర్ఘకాలంగా పనిచేస్తున్న ప్రాంతాలకు పోస్టింగ్ చేయకూడదనే విధానాన్ని కమిషన్ స్థిరంగా అనుసరిస్తోంది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!