Chicken Biryani: బిర్యానీ తినండి, లక్ష పట్టుకెళ్లండి.. ఓ రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్
- బిర్యానీ తినండి.. లక్ష పట్టుకెళ్లండి
- కోయంబత్తూరులోని ఓ రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్
- ఛాలెంజ్ లో పాల్గొన్న వందలాది మంది.
కోయంబత్తూర్లోని బోచే ఫుడ్ ఎక్స్ప్రెస్ రైలు రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ నిర్వహించింది. ఈ ఛాలెంజ్లో బుధవారం వందలాది మంది పాల్గొన్నారు. అయితే.. ఈ ఛాలెంజ్ ఎలా ఉందంటే.. 30 నిమిషాల్లో 6 ప్లేట్ల బిర్యానీ తినాలి. అలా తిన్న వారికి లక్ష రూపాయల బహుమతిని గెలుచుకోవచ్చని ఆ రెస్టారెంట్ ప్రకటించింది. అయితే.. ఇటీవలే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్లో బోచే ఫుడ్ ఎక్స్ప్రెస్ రైలు రెస్టారెంట్ ప్రారంభించారు. రెస్టారెంట్ పాపులారిటీ కోసం ఇలాంటి ఆఫర్లును ప్రకటించింది.
Read Also: AP Pensions: పింఛన్దారులకు శుభవార్త.. ఈ నెల 31నే పింఛన్లు
Also Read
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
- AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
- SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..
కాగా.. ఈ ఛాలెంజ్ వార్త తెలియగానే రెస్టారెంట్ కు జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇందులో పలువురు పురుషులు, మహిళలు పాల్గొన్నారు. అయితే.. ఈ ఛాలెంజ్ లో పాల్గొనేందుకు చాలా మంది ఆసక్త చూపడంతో.. గురువారం ఉదయం వరకు పోటీ జరిగింది. ఈటింగ్ ఛాలెంజ్ పై రెస్టారెంట్ ఓనర్ మాట్లాడుతూ, “మేము బిర్యానీ పోటీని నిర్వహించాము. ఇందులో ఆరు ప్లేట్లు తిన్నవారికి లక్ష రూపాయలు గెలుచుకుంటారని.. మూడు ప్లేట్లు తిన్నవారికి 50,000 రూపాయలు ఇస్తాం” అని ప్రకటించామన్నారు. ప్రస్తుతం 400 మంది రిజిస్టర్ చేసుకున్నారని.. ఎక్కువ మంది వస్తున్నారని తెలిపారు.
Read Also: Railway Station Collapses: మిజోరంలో కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన రైల్వే స్టేషన్
ఈ పోటీలకు మంచి స్పందన వస్తుండటంతో భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహిస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ పోటీ కోసం 1,000 ప్లేట్ల బిర్యానీని తయారు చేశామని, కిచెన్ లో వర్కర్లు 24 గంటలు పని చేస్తూనే ఉన్నారని తెలిపారు. కాగా.. ప్రతి నెలా ఒక కొత్త పోటీని నిర్వహించాలని తాము ప్లాన్ చేస్తున్నామన్నారు. తర్వాత.. మసాలా దోస పోటీ ఉండవచ్చని యాజమాన్యం పేర్కొంది.
తాజావార్తలు
-
GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
-
Karimnagar PMG Jewellery : పీఎంజీ జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
-
Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
-
Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్కు సింపుల్గా నో చెప్పిన జలమండలి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!