Earthquake : పాకిస్తాన్లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.7గా నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake : పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ సమీపంలో శనివారం ఉదయం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఇస్లామాబాద్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దీని లోతు 190 కిలోమీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పాకిస్తాన్లో తరచుగా వివిధ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే 2005లో పాకిస్థాన్లో అత్యంత ఘోరమైన భూకంపం సంభవించింది. ఇందులో 74 వేల మందికి పైగా చనిపోయారు.
Read Also:Gold Price Today : షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
Also Read
గత వారం కూడా శనివారం రాత్రి పాకిస్తాన్లోని అనేక నగరాల్లో బలమైన భూకంపం సంభవించింది. ఈ సమయంలో రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్లలో ప్రజలలో భయాందోళనలు వ్యాపించాయి. పాకిస్తాన్ వాతావరణ విభాగం (PMD) ప్రకారం.. ఇస్లామాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం లోతు 142 కిలోమీటర్లుగా భూకంప కేంద్రం హిందూకుష్ ప్రాంతం అని పాకిస్తాన్ వాతావరణ విభాగం తెలిపారు.
Read Also:TS High Court: పోలీస్స్టేషన్కు సరదాగా ఎవరూ రారు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ ప్రకారం, పాకిస్థాన్లో శనివారం రాత్రి 10:44 గంటలకు ఈ భూకంపం సంభవించింది. దీని కారణంగా పెషావర్, స్వాత్, చిత్రాల్, వాటి పరిసర ప్రాంతాల్లో భూగర్భ ప్రకంపనలు సంభవించాయి. గత నెలలో ఈ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్లో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా ఈ ప్రకంపనలు సంభవించాయి. దీంతో కాబూల్ నుంచి ఇస్లామాబాద్ వరకు భవనాలు కంపించాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..