E20 petrol: పర్యావరణహిత క్లీన్ ఇంధన ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ మేరకు భారతదేశం అంతటా ఏప్రిల్ 1 నుంచి విక్రయించే పెట్రోలో ఎక్కువ ఇథనాలు ఉండనుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి చమురు కంపెనీలు 20 శాతం వరకు ఇథనాల్ కలిపి పెట్రోల్ విక్రయించాలని, నిర్ధిష్ట నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించింది. ఫిబ్రవరి 17న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ చమురు మార్కెటింగ్ కంపెనీలు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇథనాట్ పెట్రోల్ (E20 పెట్రోల్) సరఫరా చేయాలని ఆదేశించింది.
Read Also: Peddi Second Single: పెద్ది సెకండ్ సింగిల్ ఆ రోజే దించుతున్నారు
ఇథనాల్ పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలను పాటించాలని, మినిమమ్ రీసెర్చ ఆక్టేన్ నెంబర్ (RON) 95 ఉండాలని చెప్పింది. RON ఇంధన నాణ్యతకు కొలమానం. పెట్రోల్ ఇంజన్ నాకింగ్ను ఎంత వరకు తట్టుకుంటుందో ఇది చూపిస్తుంది. ఇది కాలక్రమేణా ఇంజన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. సరళంగా చెప్పాలంటే, పెట్రోల్ ఎంత త్వరగా మండుతుంది, ఎంత ఒత్తిడిని తట్టుకుంటుంది అనే దానికి RONని కొలమానంగా ఉపయోగిస్తారు. అధికా RON (91, 95, 98) ఉన్న పెట్రోల్ ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలదు. దీని వల్ల ఇంజన్ సజావుగా నడుస్తుంది.