NTV Telugu Site icon

Srisailam: శ్రీశైలంలో ఈనెల 15 నుంచి 24 వరకు దసరా దేవి శరన్నవరాత్రులు

Srisailam

Srisailam

Srisailam: శ్రీశైలంలో ఈనెల 15 నుంచి 24 వరకు దసరా దేవి శరన్నవరాత్రులు జరగనున్నాయి. దసరాకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, వసతి కల్పిస్తామని శ్రీశైలం ఆలయ ఈవో వెల్లడించారు. ఉత్సవాల సమయంలో కుంకుమార్చన, అభిషేకాలు, కల్యాణోత్సవం యధావిధిగా కొనసాగనుంది. 15న ఉదయం శ్రీస్వామివారి అమ్మవారి యాగశాలల ప్రవేశంతో దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ప్రతి రోజు వివిధ అలంకారాలతో వివిధ వాహన సేవలను స్వీకరించనున్నారు.
9 రోజుల పాటు అలంకారాలు, వాహనసేవలు ఇవే..

*15న శైలపుత్రి అలంకారం, బృంగివాహన సేవ

*16న బ్రహ్మచారిణి అలంకారం, మయూరవాహన

*17న చంద్రఘంట అలంకారం,రావణవాహన

*18న కూష్మాండదుర్గ అలంకారం,కైలాసవాహన

*19న స్కందమాత అలంకారం,శేషవహనం

*20న కాత్యాయని అలంకారం హంసవహననంపై పుష్పపల్లకిసేవ

*21న కళరాత్రి అలంకారం, గజవాహన

*22న మహాగౌరి అలంకారం, నందివాహన

*23న సిద్ధిదాయిని అలంకారం, అశ్వవాహనసేవ, రాష్ట్ర ప్రభుత్వంచే పట్టు వస్త్రాల సమర్పణ

*24న విజయదశమి శ్రీస్వామి అమ్మవారికి నందివాహనంపై ఆలయ ఉత్సవం జమ్మివృక్షం వద్ద శమి పూజలు నిర్వహించనున్నారు. రాత్రి ఆలయ పుష్కరిణిలో శ్రీస్వామి అమ్మవారి తెప్పోత్సవంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి.

హుండీ లెక్కింపు
శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండీని అధికారులు లెక్కించారు. 28 రోజుల మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్ల 17 లక్షల 50 వేల 209 నగదు రాగా.. బంగారం 187 గ్రా., 6 కేజీల వెండి, వివిధ విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.