Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో వికలాంగులకు సామూహిక వివాహం నిర్వహించారు. ఇందులో ప్రతి జంట కూడా వివాహం తర్వాత ఒక లక్ష రూపాయలు పొందుతారు. అయితే డబ్బుపై దురాశతో ఇప్పటికే పెళ్లయిన కొన్ని జంటలు కూడా పెళ్లికి వచ్చారు. అంతేకాదు వారిలో కొందరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆస్తా మల్టీపర్పస్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఈ సామూహిక వివాహాన్ని నిర్వహించింది. అలాంటి జంటలు పట్టుబడిన వెంటనే వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు. ఇప్పుడు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
దుర్గ్లోని ఆస్తా మల్టీపర్పస్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ 300 మంది వికలాంగ జంటలకు సామూహిక వివాహాన్ని నిర్వహించింది. ఈ సంస్థ ఇప్పటికే వందలాది మంది యువతీ యువకులకు వివాహాలు జరిపించింది. ఈసారి ఒక్కో జంటకు ఇన్స్టిట్యూట్ నుంచి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్లోని సుర్గుజా, అంబికాపూర్, సూరజ్పూర్, బిలాస్పూర్, బస్తర్లకు చెందిన పలువురు దంపతులు దుర్గ్కు చేరుకున్నారు.
Read Also:Fastest Century: 27 బంతుల్లోనే సెంచరీ.. క్రిస్ గేల్ ‘ఆల్టైమ్’ రికార్డు బ్రేక్!
27 ఏళ్ల వరుడు, 45 ఏళ్ల వధువు
ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్సాయి, దుర్గ్ ఎంపీ విజయ్ బఘెల్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంతా బాగానే జరిగింది. దంపతులను సీఎం ఆశీర్వదించారు. అప్పటికే పెళ్లయిన 20 జంటలు ఈ పెళ్లికి వచ్చినట్లు ఆ సంస్థకు తెలిసింది. ఇది మాత్రమే కాదు, 27 ఏళ్ల యువకుడు డబ్బు కోసం 45 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. ఈ కార్యక్రమానికి చత్తీస్గఢ్తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ల నుంచి కూడా దంపతులు హాజరైనట్లు గుర్తించారు. కాగా, ఛత్తీస్గఢ్ ప్రజల కోసమే సామూహిక వివాహాన్ని నిర్వహించారు.
ఎఫ్ఐఆర్ నమోదు
అలాంటి జంటలను ఆ సంస్థ ఉద్యోగులు వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించామని ఆస్తా మల్టీపర్పస్ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్ ప్రెసిడెంట్ ప్రకాష్ గెడం తెలిపారు. ఈ 20 జంటలపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కొందరు జంటలు మాత్రం తాము కావాలని ఇక్కడికి రాలేదన్నారు. వారే ఇక్కడికి పిలిచారని ఆరోపించారు. కానీ ఎవరు వాళ్లను ఇక్కడికి రమ్మన్నారో చెప్పలేదు. పోలీసులు ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా ఈ జంటలపై చర్యలు తీసుకోనున్నారు.
Read Also:Andhra University: ఏయూ వీసీ, రిజిస్ట్రార్కు బెదిరింపు కాల్స్.. రాజీనామా చేయాలని వార్నింగ్..!