Dummy Currency Gang: డమ్మీ కరెన్సీ గ్యాంగ్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డమ్మీ కరెన్సీ కాగితాలతో మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి 26.8లక్షల విలువగల నకిలీ 2వేల నోట్లతో పాటు వివిధ రకాల రసాయనక ద్రావణాలు, స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రైస్ పుల్లింగ్ కి వినియోగించే రెండు రాగి కలశాలు, ఒక రాగి జగ్గు, ఒక కత్తి, రాగి నాణేం, బ్యాటరీలు, టార్చిలైట్లును నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వరంగల్ పోలీసులు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్, వర్ధన్నపేట పోలీసులు నకిలీ కరెన్సీ ముఠాలపై దాడులు చేశారు. ఎనిమిది మంది సభ్యుల ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. అదనపు సంపాదన కోసం మోసాలకు సిద్ధపడ్డారు 8 మంది సభ్యులు. నకిలీ నోట్ల దందాతో పాటు రైస్ పుల్లింగ్ కి ప్లాన్ చేశారు. అందులో భాగంగా 50 వేల అసలు నోట్లకు మూడురెట్ల నకిలీ నోట్లను ఇచ్చేలా ఒప్పందం చేసుకొని పోలీసుల నకిలీ నోట్లు పట్టు పడకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు.
Also Read
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
ఎవరికీ అనుమానం రాకుండా వుండేందుకు రెండువేల రూపాయల నకిలీ నోట్లను నలుపు కాగితాలుగా మార్చి, వాటిని తిరిగి నలుపు రంగులో వున్న కాగితాలను రసాయన ద్రావణంతో శుభ్రం చేయడంతో తిరిగి నలుపు కాగితాలు 2వేల నకిలీ నోట్లుగా మార్చే ప్రక్రియను వీడియో తీశారు నిందితులు.
దీని ఆధారంగా నకిలీ నోట్లను ఇచ్చేందుకు నగరంలో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 8 మంది ముఠా లోని నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా ముమ్మాడి ధనుంజయ్ ఆలియాస్ శివ వనపర్తి జిల్లా, గుట్టా హరిప్రసాద్ రెడ్డి రంగారెడ్డి జిల్లా, గడ్డం నాగరాజు ఇల్లందు గ్రామం, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా, చల్లా మహేష్, గొర్రెకుంట వరంగల్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. రాజు వర్ధన్నపేట, అశోక్ పెద్దమ్మగడ్డ, కిషన్ కామారెడ్డి, సతీష్ మహబూబాబాద్కు చెందిన వారు పరారీలో ఉన్నారు.
Read Also: Unstoppable: చిరంజీవి ‘అన్ స్టాబుల్’ షో కు రాకపోడానికి కారణం అదే!
ఈ ముఠా సభ్యులు నకిలీ నోట్ల చలామణితో పాటు. అతీంద్రీయ శక్తులు ఉన్న పాత్రల్ని అమ్మేదుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. రైస్ పుల్లింగ్ కోసం వాడే రాగి పాత్రలు, గోపురం కలశాలు, రాగి నాణేలను వివిధ రసాయలతో పురాతన వస్తువులుగా మార్చి అమ్మకాలు చేసి డబ్బు సంపాదించాలన్న ఆలోచనలను పోలీసులు రట్టుచేశారు. వారి దగ్గర నుండి. రెండు రాగి కలశాలు, ఒక రాగి జగ్గు, ఒక కత్తి, రాగి నాణేం, బ్యాటరీలు, టార్చిలైట్లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనంచేసుకున్నారు. సామాన్యులు మోసపోకుండా ముందే మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేసిన వర్ధన్నపేట సీఐ సదన్ కుమార్ తో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులను వరంగల్ సీపీ అభినందించారు.
తాజావార్తలు
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..