Delhi: తీవ్రస్థాయిలో నీటి కష్టాలు.. ట్యాంకర్ రాగానే ఎగబడ్డ జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. గత కొద్ది రోజులుగా మంచినీళ్ల కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. కనీస అవసరాలు తీరక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు తీవ్రమైన ఎండలు.. ఇంకోవైపు నీటి ఎద్దడి.. దీంతో హస్తిన వాసుల ఇక్కట్లు మామూలుగా లేవు. ఇక చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తాగేందుకు కూడా నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Telangana BJP: నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా..
Also Read
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే చాణక్యపురి సంజయ్ క్యాంపు ప్రాంతంలో నీటి ట్యాంకర్ రాగానే జనాలు ఎగబడ్డారు. కొందరు యువకులు ట్యాంకర్ రన్నింగ్లో ఉండగానే పైకి ఎక్కి పైపుల ద్వారా నీళ్లు నింపుకునే ప్రయత్నాలు చేశారు. మరికొంత మంది ఆ ప్రయత్నాలు చేయలేక ఇబ్బందులు పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారాయి.
ఇది కూడా చదవండి: Remal Cyclone : అస్సాంలో ‘రెమాల్’ తుఫాను..ఐదుగురు మృతి.. 42 వేల మందిపై ప్రభావం
మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటి వృధా చేస్తే రూ. 2 వేలు ఫైన్ వేస్తామని హెచ్చరించింది. కార్లు, బైకులు కడగడానికి గానీ.. వాణిజ్య అవసరాలకు ఉపయోగించిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో బృందాలను ఏర్పాటు చేసింది. ఇక హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాపై చర్చిస్తామని ఇప్పటికే ఆప్ మంత్రి అతిషీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కుట్రతోనే ఈ నీటి కష్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.
#WATCH | Delhi: Due to the water crisis, people are facing problems in many areas of Delhi. Water is being supplied to the people through tankers.
(Visuals from Chanakyapuri's Sanjay Camp area) pic.twitter.com/5HgqL7tj5O
— ANI (@ANI) May 31, 2024
తాజావార్తలు
-
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
-
Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
-
NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
-
Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
-
Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..