Murder: సెల్ఫోన్ కోసం సొంత నానమ్మనే హత్య.. ఆపై..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాస్త ఖరీదైన సెల్ఫోన్ కోసం సొంత నానమ్మని చంపి ఆపై.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగతనం చేసి ఆపై శవాన్ని వారి ఇంట్లోనే పాతిపెట్టాడు ఓ కిరాతక మనవడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన గోనెగండ్ల మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
మండలం పరిధిలోని పెద్ద మరివీడు గ్రామానికి చెందిన కురువ నాగమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడైన చిన్న బజారి కర్నూలులో స్థిరపడిపోవడంతో.. తన సొంత ఊరిలోనే ఓ ఇంటిని నిర్మించి తన ఇంట్లో తన తల్లి నాగమ్మను ఉంచాడు. ఇక నాగమ్మ పెద్ద కొడుకు పెద్ద బజారి గ్రామంలో బతుకు తెరువు కష్టంగా ఉండడంతో గుంటూరుకు బతుకుతెరువు కోసం వెళ్ళాడు. అయితే వారి కుమారుడు వెంకటేష్ అక్కడే ఉండి చెడు వ్యసనాలకు లోనయ్యాడు. ఇందులో భాగంగానే తనకు ఖరీదైన సెల్ఫోన్ కావాలని వాటికి డబ్బులు లేకపోవడంతో ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ఇందులో భాగంగానే తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి వెంకటేష్ పెద్దమరివీడుకు వచ్చేశాడు. అయితే తన అనుకున్న ప్లాన్ ప్రకారం.. బంగారాన్ని దొంగలించి ఆ డబ్బుతో ఖరీదైన సెల్ఫోన్ కొనుగోలు చేయాలని అనుకున్నాడు. ఇలా అనుకున్నాడో లేదో.. మార్చి 4వ తేదీ సాయంత్రం నాగమ్మ ఇంటికి మనవడు వెంకటేష్ వెళ్ళాడు. అక్కడే నాగమ్మ గొంతును నులిమి హత్య చేశాడు. ఆపై నాగమ్మ ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారం ఆభరణాలను తీసుకున్నాడు. ఆ తర్వాత రాత్రి సమయంలో వారి ఇంటి ఆవరణలోనే గుంతను తవ్వి వెంకటేష్ తన నానమ్మ నాగమ్మను అక్కడి పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత తనకి ఏమీ తెలియనట్లు మెరుసటి నాడు ఉదయం ఎమ్మిగనూరు నగరానికి వెళ్లి అక్కడ బంగారాన్ని విక్రయించాడు. ఆ తర్వాత రూ. 25000 పెట్టి కొత్త సెల్ఫోన్ తీసుకున్నాడు. ఆ వెంటనే సాయంత్రం గుంటూరులోని తన తల్లిదండ్రుల దగ్గరికి వెంకటేష్ చేరుకున్నాడు. పరిస్థితి ఇలా ఉండగా.. మార్చి 13వ తేదీన నాగమ్మ చిన్న మనవడు గోపాల్ గ్రామానికి వచ్చాడు. ఆ సమయంలో తన నానమ్మ ఇంట్లో లేకపోవడంతో అనుమానం వచ్చిన అతను గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులకు గతంలో వెంకటేష్ నాగమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగిందని కనుక్కొని.. వెంకటేష్ ని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. నీతో అసలు బాగోతాన్ని వెంకటేష్ ఒప్పుకున్నాడు. దీంతో హత్య చేసిన వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కు పంపించారు.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!