Murder: సెల్ఫోన్ కోసం సొంత నానమ్మనే హత్య.. ఆపై..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాస్త ఖరీదైన సెల్ఫోన్ కోసం సొంత నానమ్మని చంపి ఆపై.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగతనం చేసి ఆపై శవాన్ని వారి ఇంట్లోనే పాతిపెట్టాడు ఓ కిరాతక మనవడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన గోనెగండ్ల మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
మండలం పరిధిలోని పెద్ద మరివీడు గ్రామానికి చెందిన కురువ నాగమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడైన చిన్న బజారి కర్నూలులో స్థిరపడిపోవడంతో.. తన సొంత ఊరిలోనే ఓ ఇంటిని నిర్మించి తన ఇంట్లో తన తల్లి నాగమ్మను ఉంచాడు. ఇక నాగమ్మ పెద్ద కొడుకు పెద్ద బజారి గ్రామంలో బతుకు తెరువు కష్టంగా ఉండడంతో గుంటూరుకు బతుకుతెరువు కోసం వెళ్ళాడు. అయితే వారి కుమారుడు వెంకటేష్ అక్కడే ఉండి చెడు వ్యసనాలకు లోనయ్యాడు. ఇందులో భాగంగానే తనకు ఖరీదైన సెల్ఫోన్ కావాలని వాటికి డబ్బులు లేకపోవడంతో ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
ఇందులో భాగంగానే తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి వెంకటేష్ పెద్దమరివీడుకు వచ్చేశాడు. అయితే తన అనుకున్న ప్లాన్ ప్రకారం.. బంగారాన్ని దొంగలించి ఆ డబ్బుతో ఖరీదైన సెల్ఫోన్ కొనుగోలు చేయాలని అనుకున్నాడు. ఇలా అనుకున్నాడో లేదో.. మార్చి 4వ తేదీ సాయంత్రం నాగమ్మ ఇంటికి మనవడు వెంకటేష్ వెళ్ళాడు. అక్కడే నాగమ్మ గొంతును నులిమి హత్య చేశాడు. ఆపై నాగమ్మ ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారం ఆభరణాలను తీసుకున్నాడు. ఆ తర్వాత రాత్రి సమయంలో వారి ఇంటి ఆవరణలోనే గుంతను తవ్వి వెంకటేష్ తన నానమ్మ నాగమ్మను అక్కడి పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత తనకి ఏమీ తెలియనట్లు మెరుసటి నాడు ఉదయం ఎమ్మిగనూరు నగరానికి వెళ్లి అక్కడ బంగారాన్ని విక్రయించాడు. ఆ తర్వాత రూ. 25000 పెట్టి కొత్త సెల్ఫోన్ తీసుకున్నాడు. ఆ వెంటనే సాయంత్రం గుంటూరులోని తన తల్లిదండ్రుల దగ్గరికి వెంకటేష్ చేరుకున్నాడు. పరిస్థితి ఇలా ఉండగా.. మార్చి 13వ తేదీన నాగమ్మ చిన్న మనవడు గోపాల్ గ్రామానికి వచ్చాడు. ఆ సమయంలో తన నానమ్మ ఇంట్లో లేకపోవడంతో అనుమానం వచ్చిన అతను గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులకు గతంలో వెంకటేష్ నాగమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగిందని కనుక్కొని.. వెంకటేష్ ని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. నీతో అసలు బాగోతాన్ని వెంకటేష్ ఒప్పుకున్నాడు. దీంతో హత్య చేసిన వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కు పంపించారు.
తాజావార్తలు
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!