Duddilla Sridhar Babu : పెట్టుబడిదారులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
- టైర్ 2, 3 నగరాలకు పరిశ్రమలు, ఐటీ కంపెనీలు విస్తరించాలని ప్రభుత్వ ఉద్దేశ్యం
- 4500 కోట్లు ఐటి పరిశ్రమలకు ప్రభుత్వ సబ్సిడీల బకాయిలు పెండింగులో ఉన్నాయి
- ఒక్కొక్కటిగా ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుంది : మంత్రి శ్రీధర్బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu : పరిశ్రమలు, ఐటీ కంపెనీలు హైదరాబాద్ కే పరిమితము కాకుండా టైర్ 2, 3 నగరాలకు విస్తరించాలని ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 4500 కోట్లు 2016 నుంచి ఐటి పరిశ్రమలకు ప్రభుత్వ సబ్సిడీల బకాయిలు పెండింగులో ఉన్నాయి. ఒక్కొక్కటిగా ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుందని, ఏ ఉద్దేశ్యంతో పరిశ్రమలకు ప్రభుత్వం భూములు కేటాయించారో ఆ విధంగా పరిశ్రమలు సహేతుకమైన కారణం లేకుండా స్థాపించకపోతే భూముల పై టీఎస్ ఐఐసీ నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల అన్యాక్రాంతం పై కమిటీ నివేదిక వచ్చినాక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పరిశ్రమలకు, ఐటీకి సంబంధించి పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు.
Bangladesh : మెహర్ అఫ్రోజ్ తర్వాత బంగ్లాదేశ్ లో అదుపులోకి మరో నటి
Also Read
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
రెండు అమెరికన్ బేస్డ్ కంపెనీలు.. 9 దేశాల్లో కార్యాలయాలు ఉంటే హైదరాబాద్ లో కార్యాలయం ఏర్పాటు చేశారని, ఈ సంవత్సరం 500 మందికి, రెండేళ్ళలో 2 వేల మందికి ఉపాది కల్పిస్తామని చెప్పారన్నారు. డ్రోన్స్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్ వ్యవహారాలు ఈ కంపెనీలు చూస్తాయని, కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో కంపెనీ ఏర్పాటు చేశారన్నారు. పెట్టుబడిదారులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ విస్తరిస్తామని, గ్రామాల్లో ఉన్న టాలెంట్ ను ఉపయోగించుకుని వారికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఉన్నామన్నారు.
అనంతరం సెంటిలియన్ కంపెనీ సీఈఓ వెంకట్ మాట్లాడుతూ.. కరీంనగర్ లో మేము కంపెనీ ఏర్పాటు చేసామని, ఫ్లైట్ ట్రాకింగ్ 3డిలో రిక్రియేట్ విధానాన్ని రూపొందిసున్నామన్నారు. కరీంనగర్, హైదరాబాద్ లలో ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే మూడేళ్ళలో 2 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. డైరెక్టర్ రాదకిషోర్ మాట్లాడుతూ.. తెలంగాణకు ఈరెండు కంపెనీలు తలమానికమన్నారు. మాకు ప్రభుత్వ మద్దతు బాగుందని, 500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాం… కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
Komatireddy Venkat Reddy: అతని విషయంలో మాట్లాడేంత టైమ్ లేదు.. మాట్లాడం వేస్ట్
తాజావార్తలు
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?