Air India Flight: కేరళ రాష్ట్ర రాజధాని నుంచి దుబాయ్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఆదివారం, విమానంలోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్లో సమస్య కారణంగా టేకాఫ్ అయిన రెండు గంటలకే తిరిగి వచ్చిందని తిరువనంతపురం విమానాశ్రయ అధికారులు తెలిపారు. తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 1.19 గంటలకు సిబ్బందితో సహా 174 మందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా తిరిగి మధ్యాహ్నం 3.52 గంటలకు వెనుకకు వచ్చి సురక్షితంగా ల్యాండ్ అయిందని విమానాశ్రయ అధికారి తెలిపారు.
Also Read: Congress: మణిపూర్ సీఎంగా బీరెన్సింగ్ ఉన్నంత వరకు శాంతిస్థాపన కష్టమే..
విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారు. ఇది ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్లో సమస్య కారణంగా జరిగిందని అధికారి తెలిపారు. ప్రయాణికులు ప్రస్తుతం విమానాశ్రయంలో ఉన్నారని, ఎయిర్లైన్ ఏర్పాటు చేసిన మరో విమానంలో గంటలోపు బయలుదేరుతారని ఆయన తెలిపారు.