Drugs Seized: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Seized: బెజవాడలో మరోసారి ఎండీఎంఏ డ్రగ్స్ కలకలం సృష్టించాయి.బెంగుళూరు నుంచి బెజవాడ వచ్చిన కిలో ఎండీఎంఏ డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీ అనంతపురం డిపో బస్ ద్వారా డ్రగ్స్ బస్టాండ్ చేరుకున్నట్లు గుర్తించారు.
Read Also: Atrocious News: దారుణం.. అర్ధరాత్రి సాఫ్ట్వేర్ ఉద్యోగిని తగలబెట్టేశారు..
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ఆర్టీసీ డ్రైవర్ వైవీఎస్ రావుకి స్కూల్ బ్యాగ్ ఇచ్చి బెజవాడలో అందజేయాలని ఓ ఆగంతకుడు ఇచ్చినట్లు విచారణలో తెలిసింది. బస్సు విజయవాడ చేరుకున్న తర్వాత అర్ధరాత్రి డ్రైవర్ వైవీఎస్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్లో ఉన్న బట్టల్లో ఓ ప్యాంటు నడుము చుట్టూ ఉన్న ఓ అంగుళం మందం పట్టీలో నిందితులు డ్రగ్స్ను పెట్టి కుట్టేశారు. ప్యాంట్లో కుట్టిన భాగాన్ని చించి డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ వైవీఎస్ రావును పోలీసులు విచారించారు.
అసలు ఏం జరిగిందంటే.. బెంగళూరులోని కెంపెగౌడ బస్స్టేషన్లో శుక్రవారం ఉదయం 6 గంటలకు బెజవాడ వెళ్లే సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. బ్యాగ్లో బట్టలు ఉన్నాయని, విజయవాడలో తన స్నేహితుడు వచ్చి తీసుకుంటాడని, అతని ఫోన్నంబరు డ్రైవర్కు ఇచ్చాడు. విజయవాడ వచ్చాక, రాత్రి 10.30కు బస్సును గ్యారేజీలో పెట్టి బయటకు వస్తుండగా ఓ యువకుడు వచ్చి బ్యాగ్ను తీసుకున్నాడు. అదే సమయంలో టాస్క్ఫోర్స్, పటమట పోలీసులు డ్రైవర్ను, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బ్యాగ్ తనిఖీ చేయగా.. ఓ ప్యాంటులో ఎండీఎంఏ డ్రగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ గతంలో ఎప్పుడైనా ఇలా తీసుకొచ్చేవారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పార్సిల్ను తీసుకునేందుకు వచ్చిన యువకుడు ఎవరెవరికి సరఫరా చేస్తున్నాడు, ఎవరెవరికి చేరుతోందన్న అంశాలను రాబడుతున్నట్లు తెలుస్తోంది.
గత నెలలో కూడా ఇలాంటి ఓ ఘటన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సతీష్.. పాయసం మిక్స్ డబ్బాలో కాకినాడకు 46 గ్రాముల ఎండీఎంఏను తరలిస్తూ విజయవాడ బస్టాండ్లో దొరికిపోయాడు. ఇతను బెంగళూరులో అబ్దుల్ మిషాల్ అహ్మద్ అలియాస్ మిషాల్ నుంచి తీసుకున్నాడు.
తాజావార్తలు
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!