Drugs Seized: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Seized: బెజవాడలో మరోసారి ఎండీఎంఏ డ్రగ్స్ కలకలం సృష్టించాయి.బెంగుళూరు నుంచి బెజవాడ వచ్చిన కిలో ఎండీఎంఏ డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీ అనంతపురం డిపో బస్ ద్వారా డ్రగ్స్ బస్టాండ్ చేరుకున్నట్లు గుర్తించారు.
Read Also: Atrocious News: దారుణం.. అర్ధరాత్రి సాఫ్ట్వేర్ ఉద్యోగిని తగలబెట్టేశారు..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఆర్టీసీ డ్రైవర్ వైవీఎస్ రావుకి స్కూల్ బ్యాగ్ ఇచ్చి బెజవాడలో అందజేయాలని ఓ ఆగంతకుడు ఇచ్చినట్లు విచారణలో తెలిసింది. బస్సు విజయవాడ చేరుకున్న తర్వాత అర్ధరాత్రి డ్రైవర్ వైవీఎస్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్లో ఉన్న బట్టల్లో ఓ ప్యాంటు నడుము చుట్టూ ఉన్న ఓ అంగుళం మందం పట్టీలో నిందితులు డ్రగ్స్ను పెట్టి కుట్టేశారు. ప్యాంట్లో కుట్టిన భాగాన్ని చించి డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ వైవీఎస్ రావును పోలీసులు విచారించారు.
అసలు ఏం జరిగిందంటే.. బెంగళూరులోని కెంపెగౌడ బస్స్టేషన్లో శుక్రవారం ఉదయం 6 గంటలకు బెజవాడ వెళ్లే సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. బ్యాగ్లో బట్టలు ఉన్నాయని, విజయవాడలో తన స్నేహితుడు వచ్చి తీసుకుంటాడని, అతని ఫోన్నంబరు డ్రైవర్కు ఇచ్చాడు. విజయవాడ వచ్చాక, రాత్రి 10.30కు బస్సును గ్యారేజీలో పెట్టి బయటకు వస్తుండగా ఓ యువకుడు వచ్చి బ్యాగ్ను తీసుకున్నాడు. అదే సమయంలో టాస్క్ఫోర్స్, పటమట పోలీసులు డ్రైవర్ను, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బ్యాగ్ తనిఖీ చేయగా.. ఓ ప్యాంటులో ఎండీఎంఏ డ్రగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ గతంలో ఎప్పుడైనా ఇలా తీసుకొచ్చేవారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పార్సిల్ను తీసుకునేందుకు వచ్చిన యువకుడు ఎవరెవరికి సరఫరా చేస్తున్నాడు, ఎవరెవరికి చేరుతోందన్న అంశాలను రాబడుతున్నట్లు తెలుస్తోంది.
గత నెలలో కూడా ఇలాంటి ఓ ఘటన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సతీష్.. పాయసం మిక్స్ డబ్బాలో కాకినాడకు 46 గ్రాముల ఎండీఎంఏను తరలిస్తూ విజయవాడ బస్టాండ్లో దొరికిపోయాడు. ఇతను బెంగళూరులో అబ్దుల్ మిషాల్ అహ్మద్ అలియాస్ మిషాల్ నుంచి తీసుకున్నాడు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!