Goa Governament: గోవా సర్కారు సంచలన నిర్ణయం.. ఇకపై అలా చేస్తే జరిమానా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goa Governament: గోవా వెళ్లాలని అనుకుంటున్నారా?.. ఇంతకు ముందులాగా అనుమతి లేకుండా పర్యాటకులతో సెల్ఫీలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే.. గోవా సర్కారు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకులతో చిత్రాలను క్లిక్ చేయాలనుకున్నప్పుడు వారి గోప్యతను గౌరవించేందుకు అనుమతి తీసుకోవాలని సూచించింది. పర్యాటకుల రక్షణ, గోప్యత, ఇతర విషయాలతో పాటు వారు మోసపోకుండా ఉండేందుకు గోవా టూరిజం డిపార్ట్మెంట్ పలు సూచనలు చేసింది.
ప్రమాదాలను నివారించడానికి కొండలు, సముద్రపు రాళ్ల వంటి ప్రమాదకరమైన ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకోకుండా నిషేధం విధించింది. పర్యాటక పరిశ్రమకు సంబంధించిన అనేక ఇతర సమస్యలను కూడా హెలైట్ చేసింది. తీరప్రాంతాన్ని సందర్శించే ప్రయాణికులు గ్రాఫిటీని రాయడం ద్వారా వారసత్వ ప్రదేశాలను ధ్వంసం చేయవద్దని లేదా పాడుచేయవద్దని డిపార్ట్మెంట్ సూచించింది. అక్రమ ప్రైవేట్ టాక్సీలను అద్దెకు తీసుకోవద్దు. అధిక ఛార్జీలను నివారించడానికి మీటర్ ఛార్జీల కోసం పట్టుబట్టండి అని పేర్కొంది. సందర్శకులు అన్ని నిబంధనలను శ్రద్ధగా పాటించాలని పర్యాటక శాక కోరింది. పర్యాటక శాఖలో నమోదైన చట్టబద్ధమైన హోటళ్లు/విల్లాలు లేదా హౌసింగ్ సదుపాయాలతో వసతిని బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించింది.
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
- NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
Fire Accident: నర్సింగ్ హోమ్ లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో ఇద్దరు వైద్యులు
బీచ్లు మొదలైన బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధించబడింది. ఇది శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందని తెలిపింది. అయితే, చట్టబద్ధంగా లైసెన్స్ పొందిన రెస్టారెంట్లు, హోటళ్లు మొదలైన వాటి లోపల మద్యం బాధ్యతాయుతంగా సేవించవచ్చని వెల్లడించింది. పర్యాటకులు వాటర్ స్పోర్ట్స్, రివర్ క్రూయిజ్లను బుక్ చేసుకునేందుకు చట్టవిరుద్ధమైన టౌట్లు లేదా ఏజెంట్లను సంప్రదించవద్దని సూచించింది. పర్యాటకులు అటువంటి సేవలను బుక్ చేసేటప్పుడు పర్యాటక శాఖ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం పట్టుబట్టాలని తెలిపింది. రిజిస్టర్డ్ ట్రావెల్ ఏజెంట్లు లేదా రిజిస్టర్డ్ ఆన్లైన్ పోర్టల్ల నుండి మాత్రమే అలాంటి సేవలను బుక్ చేసుకోవాలని చెప్పింది. బహిరంగ ప్రదేశాల్లో ఆహారాన్ని వండడం నిషేధించబడిందని.. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వంట వస్తువులను స్వాధీనం చేసుకోవడంతోపాటు రూ.50,000 వరకు జరిమానా విధించడంతోపాటు ప్రాసిక్యూషన్కు దారితీయవచ్చని పేర్కొంది.
తాజావార్తలు
-
Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
-
CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
-
NBK 111: ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు: తమన్
-
Chairman’s Desk : కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా గేమ్ ఛేంజరా?
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!