Donald Trump : అబద్ధాలు చెబుతున్న ట్రంప్.. రూ.2100కోట్ల జరిమానా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump : న్యూయార్క్లో పౌర మోసానికి సంబంధించి బుధవారం డొనాల్డ్ ట్రంప్పై విచారణలో వాంగ్మూలం పూర్తయింది. తన ఆస్తుల విషయంలో రుణాలిచ్చిన బ్యాంకులకు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ ఈ కేసును దాఖలు చేశారు. విచారణ సమయంలో ట్రంప్ మోసం మరింత స్పష్టంగా కనిపించిందని, అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించడంలో పూర్తిగా విఫలమయ్యాడని జేమ్స్ చెప్పాడు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరపు న్యాయవాది క్రిస్ కిస్సే మాట్లాడుతూ.. విచారణ 11 వారాల పాటు కొనసాగినప్పటికీ, తన క్లయింట్కు వ్యతిరేకంగా ఏదీ బయటకు రాలేదన్నారు. మాజీ అధ్యక్షుడు తన బ్యాంకర్లతో ఎలాంటి మోసానికి పాల్పడలేదని ట్రంప్ తరపు న్యాయవాది తెలిపారు.
అంతేకాకుండా, అతను బ్యాంకులకు ఎటువంటి నష్టం కలిగించలేదన్నారు. బ్యాంకులు ఇప్పటికీ అతనిని చాలా వ్యాల్యుబుల్ కస్టమర్గా పరిగణిస్తున్నాయి. ఈ కేసు విచారణ అక్టోబర్ 2న ప్రారంభమైంది. ఈ కేసు పూర్తిగా ఆర్థిక పత్రాలు, కేసుకు సంబంధించిన నిపుణుల వాంగ్మూలంపై ఆధారపడింది. దీనికి సంబంధించి జస్టిస్ ఆర్థర్ కూడా తన తీర్పును వెలువరించే అవకాశం ఉంది.
Also Read
- GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
Read Also:Telangana Assembly: నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం.. గవర్నర్ ప్రసంగంపై చర్చ
2100 కోట్ల జరిమానా ఉంటుందా?
ట్రంప్ దోషిగా తేలితే కనీసం 250 మిలియన్ డాలర్లు అంటే 2100 కోట్ల జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. అలాగే, ట్రంప్కు వ్యాపార సంబంధిత ఆస్తులు ఎక్కువగా ఉన్న న్యూయార్క్లో ట్రంప్ వ్యాపారం చేయడంపై కొన్ని ఆంక్షలు ఉంటాయని చెబుతున్నారు. ట్రంప్కు సంబంధించి కొనసాగుతున్న ఈ కేసును జస్టిస్ ఆర్థర్ అంగోరాన్ విచారిస్తున్నారు. జనవరి 11న ఈ కేసులో తుది వాదనలు పూర్తయిన తర్వాత ఆర్థర్ తన తీర్పును వెల్లడించవచ్చు.
ఆరోపణలను తోసిపుచ్చిన ట్రంప్
2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలపై డొనాల్డ్ ట్రంప్ తన వాదనను బలంగా వినిపిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్కు కూడా ఎడ్జ్ ఉంది. అయితే చాలా వ్యాజ్యాలు ఆయనను వదలడం లేదు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తానేమీ తప్పు చేయలేదని ట్రంప్ అంటున్నారు. తన ఆర్థిక పత్రాల్లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనని, అయితే దీని వల్ల తన బ్యాంకులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ట్రంప్ గత విచారణలో అంగీకరించారు.
ట్రంప్కు సంబంధించిన ఈ కేసు ఆయన రాజకీయాలకే కాకుండా వ్యాపార దృక్కోణంలో కూడా చాలా ముఖ్యమైనది. ఇది సివిల్ కేసు అయినప్పటికీ, ట్రంప్ ఇప్పటికే నాలుగు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. నిరంతర చట్టపరమైన పరిణామాల కారణంగా ట్రంప్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా దెబ్బతీస్తోంది. అయితే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ తన ప్రత్యర్థుల కంటే చాలా ముందంజలో ఉన్నారు. డిసెంబర్ 11న నిర్వహించిన సర్వే ప్రకారం, 61 శాతం మంది రిపబ్లికన్లు జో బిడెన్కు బలమైన ప్రత్యామ్నాయంగా ట్రంప్ను చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.
Read Also:Mohammed Shami: స్పెషల్ రిక్వెస్ట్.. అర్జున అవార్డుకు మహమ్మద్ షమీ నామినేట్!
తాజావార్తలు
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!