Domalguda Fire Accident : దోమల్గూడ అగ్ని ప్రమాదం.. 4కు చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దోమల్గూడ ఎల్పీజీ అగ్ని ప్రమాదం కేసులో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఈ సంఘటనలో కాలిన గాయాలతో మరో ముగ్గురు వ్యక్తులు గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పద్మ (53), ధనలక్ష్మి (28), అభినవ్ (7) గురువారం కాలిన గాయాలతో మరణించగా, ఏడేళ్ల శరణ్య బుధవారం మరణించింది. దోమల్గూడలోని రోజ్ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున ఎల్పీజీ సిలిండర్ లీక్ కారణంగా మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు కాలిపోయారు.
బోనాల పండుగ సందర్భంగా కుటుంబంలోని మహిళలు అల్పాహారం సిద్ధం చేస్తుండగా మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా, ఏడుగురు వ్యక్తుల్లో నలుగురు చనిపోయారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దోమలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
అయితే.. Ntv తో దోమల్గూడ అగ్ని ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుగురికి నలుగురు చనిపోయారని, శరణ్య రెండు రోజుల క్రితం చనిపోగా ఇప్పుడు పద్మ, ధనలక్ష్మి, అభినవ్ ముగ్గురు చనిపోయారని కన్నీటిపర్యంతమయ్యారు. ఇంకా ముగ్గురిలో, ఇద్దరు గాంధీలో ఉండగా మరొక చిన్నారి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, చిన్నారి విహాన్ బ్రతకే ఛాన్స్ ఉందని, ప్రైవేట్ ఆస్పత్రి కావడంతో వైద్య ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
సమయానికి ఫైర్ సిబ్బంది,108 అంబులెన్స్ రాకపోవడంతో నష్టం ఎక్కువగా జరిగిందని, అంబులెన్స్ లు వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇండియన్ గ్యాస్ మేనేజ్ మెంట్ పై చర్యలు తీసుకోవాలన్నారు. వారి పై కేసు నమోదు చేయాలన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!