Rohit Shama Soil: అందుకే మట్టిని తిన్నా: రోహిత్ శర్మ
- 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్
- రోహిత్ శర్మ కల నెరవేరింది
- పిచ్ను నా జీవితాంతం గుర్తుంచుకుంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma reveals why he eating Soil: టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన రోహిత్ సేన.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ను ముద్దాడింది. దాంతో ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కల నెరవేరింది. భారత్ విశ్వవిజేతగా నిలిచిన అనంతరం పిచ్పై ఉన్న మట్టిని రోహిత్ తిన్నాడు. అందుకు సంబందించిన ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే పిచ్పై మట్టిని ఎందుకు తిన్నాననే విషయాన్ని రోహిత్ తాజాగా వెల్లడించాడు.
‘బార్బడోస్ పిచ్పై భారత్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గెలిచి ట్రోఫీ సాధించింది. ఈ పిచ్ నాకు ఎంతో ప్రత్యేకం. ఈ మైదానాన్ని, పిచ్ను నా జీవితాంతం గుర్తుంచుకుంటా. పిచ్ను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మట్టిని కొద్దిగా నోట్లో వేసుకున్నా. ఈ మూమెంట్స్ చాలా ప్రత్యేకమైనవి. బార్బడోస్లో మా కల నెరవేరింది. చాలా సంతోషంగా ఉన్నాం’ అని రోహిత్ శర్మ తెలిపాడు. 2007 టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు. కెప్టెన్గా రోహిత్కు ఇదే మొదటి ఐసీసీ టైటిల్.
Also Read
Also Read: Rahul Dravid-Virat Kohli: పోతూ పోతూ.. విరాట్ కోహ్లీకి టార్గెట్ ఇచ్చిన రాహుల్ ద్రవిడ్!
‘ప్రపంచకప్ సాధించామనే ఫీలింగ్ నమ్మశక్యంగా లేదు. ఫైనల్ మ్యాచ్ ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు అంతా ఒక కలలా అనిపిస్తోంది. తెల్లవారుజాము వరకు ఆటగాళ్లందరం కలిసి సంబరాలు చేసుకున్నాము. ప్రపంచకప్ గెలవడం ఎంతో ప్రత్యేకమైనది. ఈ విజయాన్ని నెను ఇంకా పూర్తిగా ఆస్వాదించలేదు’ అని హిట్మ్యాన్ రోహిత్ పేర్కొన్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో రోహిత్ సారథ్యంలోని భారత్.. ఆస్ట్రేలియాపై ఓడింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!