Varuntej: వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కు రానున్న సెలబ్రేటీ లు ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల విషయం గురించి మనందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే..అయితే గత కొంతకాలంగా ఈ జంటకు సంబంధించిన ప్రేమ పెళ్లి డేటింగ్ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు అంటూ ఇప్పటికే చాలాసార్లు అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఆ వార్తలపై అటు లావణ్య త్రిపాఠి కానీ ఇటు వరుణ్ తేజ్ కానీ అటు మెగా ఫ్యామిలీ కానీ అస్సలు స్పందించలేదు. అయితే మొత్తానికి ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ ఆన్ స్క్రీన్ జంట రియల్ లైఫ్ జంటగా మారబోతున్నారు..
జూన్ 9న అనగా నేడు శుక్రవారం రోజున వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ జరగనుందని అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీనితో మెగా ఫ్యామిలిలో పెళ్లి భాజాలు మోగనున్నాయని తెలుస్తుంది.ఇప్పటికే అందుకు సంబంధించిన సందడి కూడా మొదలైంది. కాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు కలిసి అంతరిక్షం, మిస్టర్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఎప్పుడూ వీరిద్దరూ ఎప్పుడూ మీడియా కంట పడలేదని తెలుస్తుంది. కలిసి వెకేషన్ కు వెళ్లడం కానీ ఒకరి గురించి ఒకరు ట్వీట్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయలేదు. ఇది ఇలా ఉంటే ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు ఏ ఏ సెలబ్రిటీలు హాజరు కానున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు కేవలం వరుణ్ మరియు లావణ్య త్రిపాఠిల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ కోసం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి రాబోతున్నాడని సమాచారం.అలాగే రామ్ చరణ్, చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా మెగా ఫ్యామిలీ నుంచి అందరూ కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎంగేజ్మెంట్ పూర్తయ్యాక వివాహ తేదీని కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికీ మెగా అభిమానులు ఇంకా ఈ వార్త ను నమ్మలేకపోతున్నారు
Also Read
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
తాజావార్తలు
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!