Eyes Care Tips: కంటి శుక్లం సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఇలా చేయండి..
- భారత్ లో పెరుగుతున్న కంటి శుక్లం సమస్య
- 80.1% మంది కంటిశుక్లం కారణంగానే కంటి చూపు కోల్పోయారని నివేదిక వెల్లడి
- సమస్య రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
భారతదేశంలో కంటిశుక్లం పెద్ద సమస్యగా మారుతోంది. WHO, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ (NPCB) నిర్వహించిన ఒక సర్వే ప్రకారం భారత్ లో 22 మిలియన్లకు పైగా ప్రజలు అంధులుగా ఉన్నారు. వీటిలో 80.1% కేసులు కంటిశుక్లం కారణంగానే కంటి చూపు కోల్పోయారు. ప్రతి సంవత్సరం దాదాపు 3.8 మిలియన్ల మంది కంటిశుక్లం కారణంగా అంధులవుతున్నారు. కంటి శుక్లం సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఈ ట్రిప్ ఫాలో అవ్వండి. ఎక్కువసేపు వేడికి గురికావడం వల్ల కళ్లు పొడిబారడం, చికాకు కలిగించవచ్చు. అయితే విపరీతమైన చలి వల్ల రక్తనాళాలు తగ్గి, కళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుంది. మీ కళ్ళను రక్షించుకోవడానికి బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించండి. తగినంత నీరు త్రాగండం మంచింది. విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ధూమపానం వల్ల కంటిశుక్లం అధ్వాన్నంగా ఉంటుంది. పొగాకు పొగలో ఉండే టాక్సిక్ కెమికల్స్ కళ్ల లెన్స్లో ఉండే ప్రొటీన్లను దెబ్బతీసి చూపు మందగింపజేస్తుంది.
Also Read
స్టెరాయిడ్స్ను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల కంటిశుక్లం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. స్టెరాయిడ్స్ కంటి లెన్స్ నిర్మాణంలో మార్పులకు కారణమవుతాయి. ఆయుర్వేద వైద్యులు, వైద్యులను సంప్రదించకుండా ఎలాంటి మందులు వాడకూడదు. కంటిశుక్లం ప్రారంభంలోనే గుర్తించేందుకు రెగ్యులర్ కంటి పరీక్ష చాలా ముఖ్యం. దీంతో కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా సకాలంలో గుర్తించవచ్చు. సకాలంలో చికిత్స చేయడం ద్వారా నయం చేయవచ్చు. తర్పణ్, అష్యోతన్ కర్మ అనేవి ఆయుర్వేద చికిత్సలు. ఇవి ముఖ్యంగా కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తాయి. తర్పణం అనేది పోషణను అందించడానికి మరియు దృష్టిని మెరుగుపరచడానికి కళ్ళ చుట్టూ ఔషధ నెయ్యిని పూయడం. అష్చ్యోతన కర్మ అనేది కళ్ళను శుభ్రపరచడానికి మరియు దృష్టిని మెరుగుపరచడానికి మూలికా కంటి చుక్కలను ఉపయోగించడం. సరైన కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ చికిత్సలు అనుసరించాలని సిఫార్సు చేయబడింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!