DK Shivakumar: కర్ణాటక సీఎం కుర్చీ పోటీకి శుభం కార్డ్.. సైడ్ అయినట్లు డీకే పోస్ట్
- సీఎంగా ఐదేళ్లూ సిద్ధరామయ్యే కొనసాగుతారన్న డీకే శివకుమార్
- డిప్యూటీ సీఎం ఎక్స్ పోస్ట్తో నాయకత్వ మార్పు ప్రచారానికి తెర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ప్రచారానికి తెరపడింది. ఈ ప్రచారానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ‘ఎక్స్’ పోస్ట్తో ముగింపు పలికారు. సీఎంగా ఐదేళ్లూ సిద్ధరామయ్యే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. తామంతా ఆయనకు సహకరిస్తామని ఈ సందర్భంగా డీకే శివకుమార్ వెల్లడించారు.
READ ALSO: iBomma Case: ఐబొమ్మ స్థాపకుడు ఇమ్మడి రవిపై మరో నాలుగు కేసులు నమోదు…
Also Read
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
- Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
ఈ ప్రకటన వెలువడక ముందు వరకు కూడా కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ పీక్స్కు చేరినట్లు టాక్ నడిచింది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూడు ముక్కలుగా చీలిపోయారు. వారిలో ఒక వర్గం సిద్ధరామయ్యకు, రెండవ వర్గం డీకే శివ కుమార్కు, కొత్తగా మూడవ వర్గంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున టీం తెరపైకి వచ్చింది. 2023లో సిద్ధరామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకుంది. మొదట్లో అనుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పుడు ముఖ్యమంత్రి పగ్గాలు డీకే శివకుమార్కు అప్పగించాలని కొంత మంది ఎమ్మెల్యేలు డిమాండ్ లేవనెత్తుతున్నారు. తనను ముఖ్యమంత్రి చేయాలంటూ డీకే శివకుమార్ ఇప్పటికే పలుసార్లు హై కమాండ్తో చర్చలు కూడా జరిపారు.
ఈ నేపథ్యంలో డీకే తరఫు ఎమ్మెల్యేలు నిన్న రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. నిన్న(గురువారం) ఎమ్మెల్యేలు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పగ్గాలను డీకే శివకుమార్కు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. మరోవైపు.. సిద్ధరామయ్య సీఎం పీఠం వదులుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈక్రమంలో శుక్రవారం ఎక్స్ వేదికగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పూర్తి ఐదేళ్లు సిద్ధరామయ్యే కర్ణాటక సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేస్తూ పోస్ట్ చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా కర్ణాటకలో జరుగుతున్న పవర్ పాలిటిక్స్కు తెర పడినట్లు అయ్యింది.
READ ALSO: Flipkart Black Friday Sale: ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ డేట్ ఫిక్స్..
All 140 MLAs are my MLAs. Making a group is not in my blood.
The CM decided to reshuffle the cabinet. Everyone wants to become a minister, so it is quite natural for them to meet the leadership in Delhi.
It is their right. We can’t stop them and say no.The CM has said that… pic.twitter.com/XSZ1ZiqXC8
— DK Shivakumar (@DKShivakumar) November 21, 2025
తాజావార్తలు
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
-
Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
-
Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
-
Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!