DK Aruna : బడ్జెట్ బడుగు బలహీనవర్గాలకు ఊతం ఇచ్చి, దేశ ప్రగతికి దోహద పడేలా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్ సమావేశాల్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే.. బడ్జెట్పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు బలహీనవర్గాల కు ఊతం ఇచ్చి, దేశ ప్రగతికి దోహద పడేలా ఉందన్నారు. అంతేకాకుండా.. రైతులకు 20 లక్షల కోట్ల రుణాలు ఇవ్వడంతో పాటు “శ్రీ అన్న ” పథకం ద్వారా చిరు ధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహం అందించి దేశాన్ని హరిత అభివృద్ధి వైపు నడిపించే నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. నవ భారత నిర్మాణం దిశగా భారత దేశాన్ని నడిపించడానికి, దేశ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనను ఈ బడ్జెట్ వేగవంతం చేస్తుందని డీకే ఆరుణ అన్నారు.
Also Read : Layoff in paypal : నేడు పే పాల్ వంతు.. ఊడిపోయిన 2000ఉద్యోగాలు
Also Read
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
పేదల ఇళ్ళ నిర్మాణం కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 79 వేల కోట్లు కేటాయించడం గర్వకారణమన్నారు డీకే అరుణ. దేశ వ్యాప్తంగా 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను దిజిటలైజ్ చేయడం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించడం రైతాంగానికి మేలు చేసే చర్య అని డీకే అరుణ అన్నారు. ఇదిలా ఉంటే.. బడ్జెట్ సమావేశాల్లో.. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం చివరి పూర్తి స్థాయి బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఏ వస్తువులు చౌకగా ఉంటాయో, ఏ వస్తువుల ధరలు ప్రియంగా మారనున్నాయో వివరించారు. కేంద్ర బడ్జెట్లో మొబైల్స్, టీవీలు, కెమెరాల విడిభాగాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది కేంద్రం. దిగుమతి చేసుకునే బంగారు ఆభరణాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. అలాగే సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీని 16 శాతానికి పెంచింది.
Also Read : Budget 2023: మూలధన వ్యయం భారీగా పెంపు.. 33 శాతం పెరిగి రూ.10లక్షల కోట్లకు చేరిక
తాజావార్తలు
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!