Diwali 2025 Festival Date: కన్ఫ్యూజన్లో జనాలు.. దీపావళి పండగ ఏ తేదీనో తెలుసా?
- హిందూ మతంలో దీపావళికి ప్రత్యేక ప్రాముఖ్యత
- పండగ తేదీ విషయంలో కన్ఫ్యూజన్లో జనాలు
- పండగను ఏ రోజున జరుపుకోవాలో తెలుసా?
‘దీపావళి’ పండుగకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దీపాల పండుగ కోసం దేశంలోని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 2025 దీపావళి పండగ తేదీ విషయంలో జనాలు కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొంతమంది జ్యోతిష్కులు పండగ అక్టోబర్ 20న వస్తుందని చెబుతుండగా.. మరికొందరు అక్టోబర్ 21న అని అంటున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండగను ఏ రోజున జరుపుకోవాలో తెలుసుకుందాం.
దేశంలోని ప్రముఖ పండితుల సంస్థ ‘కాశీ విద్వత్ పరిషత్’.. దీపావళి పండగను అక్టోబర్ 20న జరుపుకోవాలని స్పష్టం చేసింది. దీపావళి పండగ తేదీల గందరగోళం నేపథ్యంలో ఇటీవల కౌన్సిల్ ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో దీపావళి తేదీపై సుదీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారు. మతపరమైన సూత్రాలు, లేఖనాత్మక లెక్కల ఆధారంగా.. పూర్తి ప్రదోష కాలం అక్టోబర్ 20న మాత్రమే ఉంటుందని తేల్చారు. అక్టోబర్ 21న అమావాస్య మూడున్నర గంటలకు పైగా ఉండటంతో.. నక్త ఉపవాసం విచ్ఛిన్నం చేయడానికి ఆ రోజు సమయం ఉండదు. అందుకే అక్టోబర్ 20న దీపావళిని జరుపుకోవాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
Also Read
- Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే...
- MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
- Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
- Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?
Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన రో-కో!
అక్టోబర్ 4న కాశీ విద్వత్ పరిషత్ సమావేశం కౌన్సిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ రామచంద్ర పాండే అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కాశీ విద్వత్ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రామనారాయణ ద్వివేది హాజరయ్యారు. ద్రిక్ పంచాంగ్ ప్రకారం ఈ సంవత్సరం అమావాస్య తిథి అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:44 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 21న రాత్రి 9:03 గంటలకు ముగుస్తుంది. దీపావళి నాడు లక్ష్మీ, గణేశులను పూజించడానికి అత్యంత పవిత్రమైన సమయం సాయంత్రం 7:08 నుంచి 8:18 వరకు. ప్రదోష కాలం, స్థిరమైన లగ్నంతో సమానంగా ఉండే ఈ సమయం లక్ష్మీదేవి, గణేశుడి ఆశీస్సులు పొందడానికి అనువైనది.
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!