Divvela Madhuri: కారు ప్రమాద ఘటనపై మాధురి ఆసక్తికర విషయాలు..
- మాధురిని పలాస ఆసుపత్రి నుంచి విశాఖ తరలింపు
- నాది సెల్ఫ్ ఆక్సిడెంట్- మాధురి
- పిల్లలు నన్ను జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నించటంతో బాధ అనిపించింది
- మనస్తాపంతో స్వీయ ప్రమాదం చేసుకుని చనిపోవాలనుకున్నాను- మాధురి
- నేను వాణి కారణంగా మనోవేదనకు గురయ్యాను- దివ్వెల మాధురి నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టారు- మాధురి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆగిఉన్న కారును మాధురి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి గాయాలు కాగా.. పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మాధురిని విశాఖ ఆస్పత్రికి తరలించారు. కాగా.. పలాస ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు ఆమె నిరాకరించారు. చాలా సేపు బలవంతం చేసిన తర్వాత వైద్యులు చికిత్స అందించారు.
The Birthday Boy OTT: ఆహాలో దూసుకుపోతోన్న ‘ది బర్త్డే బాయ్’
Also Read
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
- Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్గా..
- Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో నెలల తరబడి తాజాగా..!
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
ఈ సమయంలో మాధురి మీడియాతో మాట్లాడారు. అయితే తాను చనిపోవాలనే ఉద్దేశంతో మరో కారును ఢీకొట్టానని తెలిపింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక చనిపోవాలనుకున్నానని పేర్కొంది. సూసైడ్ చేసుకునేందుకు పలాస బయల్దేరానని చెప్పింది. తనది సెల్ఫ్ ఆక్సిడెంట్ అని అన్నారు. పిల్లలు తనను జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నించటంతో బాధ అనిపించిందని.. తనపై ఆరోపణలు చేస్తే భరిస్తాను కానీ, పిల్లల గురించి మాట్లాడితే భరించలేనని చెబుతోంది. అందుకే మనస్తాపంతో స్వీయ ప్రమాదం చేసుకుని చనిపోవాలనుకున్నానని మాధురి తెలిపింది. మరోవైపు.. తనను పోలీసులు ఇబ్బంది పెట్టారని.. బ్లడ్ శాంపిల్స్ పేరుతో ఇబ్బందులు గురి చేశారంది.
కాగా.. పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధురి స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. ఈ అంశంపై పలాస డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మాధురి కారు యాక్సిడెంట్ పై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇన్విస్టిగేషన్ జరుగుతుందని తెలిపారు. తాము తనను మేనాప్లీట్ చేస్తున్నామని మాధురి చెప్పటం కరెక్ట్ కాదన్నారు. యాక్సిడెంట్ కేసుల్లో కామన్ గా బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేస్తాం.. కేసు తీవ్రత దృష్ట్యా తమ నిబంధనలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్గా..
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో నెలల తరబడి తాజాగా..!
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!