Divvela Madhuri: కారు ప్రమాద ఘటనపై మాధురి ఆసక్తికర విషయాలు..
- మాధురిని పలాస ఆసుపత్రి నుంచి విశాఖ తరలింపు
- నాది సెల్ఫ్ ఆక్సిడెంట్- మాధురి
- పిల్లలు నన్ను జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నించటంతో బాధ అనిపించింది
- మనస్తాపంతో స్వీయ ప్రమాదం చేసుకుని చనిపోవాలనుకున్నాను- మాధురి
- నేను వాణి కారణంగా మనోవేదనకు గురయ్యాను- దివ్వెల మాధురి నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టారు- మాధురి.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆగిఉన్న కారును మాధురి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి గాయాలు కాగా.. పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మాధురిని విశాఖ ఆస్పత్రికి తరలించారు. కాగా.. పలాస ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు ఆమె నిరాకరించారు. చాలా సేపు బలవంతం చేసిన తర్వాత వైద్యులు చికిత్స అందించారు.
The Birthday Boy OTT: ఆహాలో దూసుకుపోతోన్న ‘ది బర్త్డే బాయ్’
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
ఈ సమయంలో మాధురి మీడియాతో మాట్లాడారు. అయితే తాను చనిపోవాలనే ఉద్దేశంతో మరో కారును ఢీకొట్టానని తెలిపింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక చనిపోవాలనుకున్నానని పేర్కొంది. సూసైడ్ చేసుకునేందుకు పలాస బయల్దేరానని చెప్పింది. తనది సెల్ఫ్ ఆక్సిడెంట్ అని అన్నారు. పిల్లలు తనను జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నించటంతో బాధ అనిపించిందని.. తనపై ఆరోపణలు చేస్తే భరిస్తాను కానీ, పిల్లల గురించి మాట్లాడితే భరించలేనని చెబుతోంది. అందుకే మనస్తాపంతో స్వీయ ప్రమాదం చేసుకుని చనిపోవాలనుకున్నానని మాధురి తెలిపింది. మరోవైపు.. తనను పోలీసులు ఇబ్బంది పెట్టారని.. బ్లడ్ శాంపిల్స్ పేరుతో ఇబ్బందులు గురి చేశారంది.
కాగా.. పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధురి స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. ఈ అంశంపై పలాస డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మాధురి కారు యాక్సిడెంట్ పై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇన్విస్టిగేషన్ జరుగుతుందని తెలిపారు. తాము తనను మేనాప్లీట్ చేస్తున్నామని మాధురి చెప్పటం కరెక్ట్ కాదన్నారు. యాక్సిడెంట్ కేసుల్లో కామన్ గా బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేస్తాం.. కేసు తీవ్రత దృష్ట్యా తమ నిబంధనలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!