NTV Telugu Site icon

AP: రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ..ఒక్క రోజులో దాదాపు 95శాతం

Pensions

Pensions

రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 95 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం.. సాయంత్రం ఏడుగంటల సమయానికి దాదాపు 94.15 శాతం మేర పంపిణీ పూర్తి చేసింది. 61,60,825 మందికి పెన్షన్ల నగదు అందజేసింది. 4,159 కోట్ల రూపాయల పెన్షన్ మొత్తం లబ్ధిదారులకు అందాయి. 2.65 లక్షల మంది వాలంటేర్ లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా జరగని పెన్షన్ పంపిణీ జరగలేదని అధికార నాయకులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం 1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగులతో రికార్డు స్థాయిలో 12 గంటల వ్యవధి లో పెన్షన్లు పంపిణీ చేపట్టింది. గత ప్రభుత్వ హయంలో 2.65 మంది వాలంటీర్ లు ఉన్నా ఒక్క రోజులో కేవలం 88 శాతం మాత్రమే పంపిణీ చేశారు. సమర్థ నాయకత్వం ఉంటే అధికారులు , ఉద్యోగులు ఎంత అద్భుతం గా పని చేస్తారో అంటూ నిరూపణ అయ్యిందని సీఎం చంద్రబాబు ప్రసంశలు కురిపించారు. పెన్షన్ పంపిణీ లో పాల్గొన్న అధికారుల నుంచి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల అందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

READ MORE: Bharateeyudu 2 : భారతీయుడు 2 నుండి వావ్.. అనేలా “క్యాలెండర్ సాంగ్”

కాగా.. కూటమి ప్రభుత్వం ఈ పింఛను పెంచడంతో పాటు గడిచిన మూడు నెలల నుంచి పింఛను అందజేశారు. వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్య కారులు, చేనేత, కల్లుగీత కార్మికులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్‌కు గతంలో నెలకు రూ.3వేలు ఉంటే.. ఇప్పుడు రూ.4వేకు పెరిగింది. పింఛను రూ.4వేలకు పెంచగా.. మూడు నెలలకు (నెలకు రూ.వెయ్యి చొప్పున) రూ.3000 కలిపి రూ. 7000 ప్రభుత్వం ఇస్తోంది. ఇక దివ్యాంగుల విషయానికి వస్తే.. వారికి గతంలో రూ.3వేల ఉంటే.. ఇప్పుడు ఒకేసారి రూ. 6వేలకు పెంచింది ప్రభుత్వం. దివ్యాంగుల్లో పూర్తి వైకల్యం ఉన్న వారికి రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పింఛన్ పెరిగింది. అలాగే తీవ్ర అనారోగ్యంతో (కిడ్నీ, లివర్, గుండె మార్పిడి) బాధపడుతున్న వారికి ఇచ్చే పింఛను రూ.5000 నుంచి రూ.15వేలకు పెంచింది ప్రభుత్వం. ఈ కేటగిరీ కింది పింఛను పొందే వారి సంఖ్య 24318గా ఉంది.