CM KCR: 4లక్షలకు పైగా పోడు పట్టాలు పంపిణీ.. పోడు రైతులపై కేసులు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసిఫాబాద్, సిర్పూర్ (టి) నియోజకవర్గ ఆదివాసీలకు సీఎం కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేశారు. పోడు పట్టాలు పొందిన ఆదివాసీలకు రైతుబంధు చెక్కులను సైతం అందించారు. పోడు పట్టాలన్నింటినీ మహిళల పేరు మీదే అందిస్తున్నామని.. రెండు మూడు రోజుల్లో పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని సీఎం తెలిపారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాల్సి ఉందని తెలిపారు. సమాజం చైతన్యవంతం అవుతున్నా కొద్దీ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నామన్నారు. మరోవైపు ఎన్నో ఏళ్ల ఆదివాసీల పోరాట ఆశయం నెరవేరుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,51,000 మంది రైతులకు 4లక్షల 66 వేల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోడు విషయంలో గిరిజన రైతులు కాకుండా గిరిజనులు కానివారు కూడా ఉన్నారన్నారు. అయితే, 75 ఏళ్లుగా వారు ఒక చోట నివాసముంటున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందుకోసం ఒక ప్రక్రియను తీసుకొస్తామని.. త్వరలోనే పనులు పూర్తి చేసి వారికి కూడా న్యాయం చేస్తామన్నారు కేసీఆర్.
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
మరోవైపు పోడు రైతుల పై కేసులు ఉపసంహరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గతంలో అడవులను ఆక్రమించారని కొంతమంది గిరిజనుల మీద కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వమే ఈరోజు వారికి పట్టాలిచ్చి.. రైతు బంధును మంజూరు చేసింది. వారిమీద నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అందుకోసం అనుసరించాల్సిన ప్రక్రియపై సీఎస్, డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ రైతుల పొలాల వరకు త్రీ ఫేజ్ కరెంట్ అందేలా చేస్తామని.. అంతేకాకుండా ‘గిరివికాసం’ కింద బోర్లు వేయిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
అంతకుముందు పర్యటనలో భాగంగా ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కుమురం భీం విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!