టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాలతో పాటుగా.. తను బయట కూడా ముక్కుసూటితనానికి కేరాఫ్ అడ్రస్. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన సోషల్ మీడియా రివ్యూల గురించి మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే నెగటివ్ రివ్యూలు ఇచ్చే వారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
Also Read :Bimbisara 2 : ఆగిపోయినట్లేనా? ‘బింబిసార 2’పై వీడని సందిగ్ధత!
కృష్ణవంశీ మాట్లాడుతూ.. ‘సినిమా రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే 90% మంది నా దృష్టిలో ‘మూర్ఖులు’. మీరంతా సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్నారు. టికెట్ కూడా కొనకుండా ఫ్రీగా సినిమాలు చూస్తూ, మళ్ళీ అదే సినిమాని చంపేయడానికి మీకు మనసెలా వస్తుంది?. కనీసం ఒక వారం రోజులు ఆగితే ప్రేక్షకులు సినిమాను చూస్తారు, ఆ లోపే రివ్యూలతో ఆడియన్స్ని భయపెట్టడం సరికాదు’ అని ఆయన నిలదీశారు. అలాగే పూరీ ‘నేనింతే’ డైలాగ్స్తో కౌంటర్ ఇస్తూ.. ‘రివ్యూలు రాసి సినిమాలు తీసిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారని, వారికి కనీసం స్క్రీన్ ప్లే రాయడం కూడా రాదు’ అని .. అంటూ ‘సినిమా లేకపోతే మీకు బతుకు లేదు, మరి అదే సినిమాని నాశనం చేస్తూ అన్నం ఎలా తింటున్నారు? మీకు కనీసం సిగ్గు అనిపించడం లేదా?’ అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఫాలోవర్స్ కోసం సినిమా కష్టాన్ని తక్కువ చేయవద్దని ఆయన హెచ్చరించారు.