ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దిల్ రాజు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దూసుకెళ్తున్నారు. అయితే అప్పుడప్పుడు డైరెక్టర్స్, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ అలరిస్తూ ఉంటారు.. దిల్ రాజు కూడా గతంలో రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ ను అందుకున్న అంజలి గీతాంజలి సినిమాలో నటించారు..
అయితే ఇప్పుడు మరోసారి దిల్ రాజు వెండితెరపై కనపడబోతున్నారని సమాచారం. గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా రాబోతుంది. ఇది నటి అంజలి 50వ సినిమా కావడం విశేషం. గీతాంజలి సినిమాలో నటించిన వాళ్లంతా ఈ సీక్వెల్ లో కూడా నటించారు. కోన వెంకట్ రచన, నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.. ఇటీవల ఈ సీక్వెల్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్… ఆ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది..
ఈ సినిమా అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసుకొని మార్చి 22 న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది.. మొదటి పార్ట్ లో దిల్ రాజు గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడంతో రెండో పార్ట్ లో కూడా దిల్ రాజుని మూవీ మేకర్స్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వమని అడిగితే ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. దీంతో గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాలో దిల్ రాజు కనపడనున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈయన ప్రస్తుతం దిల్ రాజు గేమ్ ఛేంజర్ తో పాటు శతమానం భవతి సీక్వెల్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే మరో బ్యానర్ స్థాపించి పలు చిన్న సినిమాలు తీస్తున్నారు..
