MMTS Trains: హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్స్.. ఎప్పటి నుంచో తెలుసా..?
తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దింది. దీంతో ప్రతి రోజూ వేల మంది భక్తులు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొనేందుకు వెళ్తుంటారు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ నుంచి రోజు పది వేల మందికి పైగా భక్తులు వెళ్తారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు యాదగిరిగుట్టకు వెళ్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య కారణంగా గంటన్నర పాటు సిటీ దాటేందుకు టైం పడుతోంది. దీంతో బస్సుల్లో, ప్రైవేట్ వెహికిల్స్ అధిక మొత్తం ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దాంతో పాటు సమయం కూడా ఎక్కువగా పడుతోంది.
Read Also: Nabha Natesh : కిల్లింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
ఎంఎంటీఎస్ ట్రైన్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగర వాసులు ట్రాఫిక్ సమస్య లేకుండా తొందరగా యాదాద్రికి చేరుకోవచ్చునని కోరుతున్నారు. ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతాయని ఎప్పటి నుంచో చెబుతున్నారు. భక్తుల డిమాండ్ మేరకు హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్లు నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ రెడీ అయ్యింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండోదశ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఆ పనులు పూర్తి కావాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Also: Poverty: భారత్లో తగ్గిన పేదరికం.. 41.5 కోట్ల మందికి విముక్తి..
ఎంఎంటీఎస్ ట్రైన్లు రాయగిరి స్టేషన్ వరకు పొడగించాలని గత ఆరేళ్ల క్రితమే కేంద్ర రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. మౌలాలి నుంచి ఘట్కేసర్ ట్రైన్లు ఉండగా.. అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైను వేయాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు సూచించింది. ఆయితే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాదాద్రి ఎంఎంటీఎస్ ట్రైన్లు నడిపే విషయమై కీలక ప్రకటన చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు కేంద్ర ప్రభుత్వం రూ. 330 కోట్లు నిధులు ఖర్చు పెడుతోందని చెప్పారు.
Read Also: GST Council: ఆన్లైన్ గేమింగ్పై 28శాతం పన్ను విధించేందుకు కౌన్సిల్ నిర్ణయం
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఎంఎంటీఎస్ రెండోదశ ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు తొందరగా పనులు చేస్తున్నారు. ఇప్పటికే మౌలాలి నుంచి ఘట్కేసర్ వరకు 21 కిలోమీటర్ల మేర కొత్తగా రెండు లైన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 35 కిలోమీటర్ల మేర కొత్త లైను వేస్తే హైదరాబాద్ నుంచి జస్ట్ రూ.20 టిక్కెట్తో యాదగిరి గుట్టకు వెళ్లే అవకాశం వస్తుంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకోటవంతో పాటు కేవలం 40 నిమిషాల్లోనే యాదాద్రికి చేరుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!