MMTS Trains: హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్స్.. ఎప్పటి నుంచో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దింది. దీంతో ప్రతి రోజూ వేల మంది భక్తులు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొనేందుకు వెళ్తుంటారు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ నుంచి రోజు పది వేల మందికి పైగా భక్తులు వెళ్తారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు యాదగిరిగుట్టకు వెళ్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య కారణంగా గంటన్నర పాటు సిటీ దాటేందుకు టైం పడుతోంది. దీంతో బస్సుల్లో, ప్రైవేట్ వెహికిల్స్ అధిక మొత్తం ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దాంతో పాటు సమయం కూడా ఎక్కువగా పడుతోంది.
Read Also: Nabha Natesh : కిల్లింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..
Also Read
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
ఎంఎంటీఎస్ ట్రైన్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగర వాసులు ట్రాఫిక్ సమస్య లేకుండా తొందరగా యాదాద్రికి చేరుకోవచ్చునని కోరుతున్నారు. ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతాయని ఎప్పటి నుంచో చెబుతున్నారు. భక్తుల డిమాండ్ మేరకు హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్లు నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ రెడీ అయ్యింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండోదశ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఆ పనులు పూర్తి కావాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Also: Poverty: భారత్లో తగ్గిన పేదరికం.. 41.5 కోట్ల మందికి విముక్తి..
ఎంఎంటీఎస్ ట్రైన్లు రాయగిరి స్టేషన్ వరకు పొడగించాలని గత ఆరేళ్ల క్రితమే కేంద్ర రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. మౌలాలి నుంచి ఘట్కేసర్ ట్రైన్లు ఉండగా.. అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైను వేయాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు సూచించింది. ఆయితే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాదాద్రి ఎంఎంటీఎస్ ట్రైన్లు నడిపే విషయమై కీలక ప్రకటన చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు కేంద్ర ప్రభుత్వం రూ. 330 కోట్లు నిధులు ఖర్చు పెడుతోందని చెప్పారు.
Read Also: GST Council: ఆన్లైన్ గేమింగ్పై 28శాతం పన్ను విధించేందుకు కౌన్సిల్ నిర్ణయం
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఎంఎంటీఎస్ రెండోదశ ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు తొందరగా పనులు చేస్తున్నారు. ఇప్పటికే మౌలాలి నుంచి ఘట్కేసర్ వరకు 21 కిలోమీటర్ల మేర కొత్తగా రెండు లైన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 35 కిలోమీటర్ల మేర కొత్త లైను వేస్తే హైదరాబాద్ నుంచి జస్ట్ రూ.20 టిక్కెట్తో యాదగిరి గుట్టకు వెళ్లే అవకాశం వస్తుంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకోటవంతో పాటు కేవలం 40 నిమిషాల్లోనే యాదాద్రికి చేరుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!