Dera Baba: పెరోల్ పై బయటకు వచ్చిన బాబా.. మరి ఈ సారి డేరా ఎక్కడో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dera Baba: అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా(55)కు కోర్టు 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. డేరా బాబా తన సిర్సా ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో హర్యానాలోని సనారియా జైలులో 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనూ అంటే గత ఏడాది అక్టోబర్ 14వ తేదీన కోర్టు ఇతడికి పెరోల్ మంజూరు చేసింది. డేరా చీఫ్ 40 రోజుల పెరోల్ గత ఏడాది నవంబర్ 25న ముగిసింది. మళ్ళీ తాజాగా 40 రోజుల పాటు పెరోల్ మంజూరు చేయబడింది. డేరా బాబాకు నిబంధనల ప్రకారమే పెరోల్ ఇచ్చినట్లు రోహ్తక్ డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ తెలిపారు.
Read Also: Vande Bharat: ‘వందేభారత్’ ట్రైన్ పై మళ్లీ దాడి.. ఏమైంది జనాలకు
Also Read
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
- Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్మార్టంలో షాకింగ్ విషయాలు
- Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
ఇదే విషయంపై హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా, డేరా చీఫ్ తాజా పెరోల్ అభ్యర్థనపై వ్యాఖ్యానిస్తూ.. 40 రోజుల పెరోల్ కోరుతూ డేరా బాబా దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఈ పెరోల్ వ్యవధిలో..గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జనవరి 25న డేరా మాజీ చీఫ్ షా సత్నామ్ సింగ్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెప్పా రు. అక్టోబర్ 14న విడుదలైన ఆయన ఉత్తరప్రదేశ్లోని తన బర్నావా ఆశ్రమానికి వెళ్లారు. అక్టోబరు-నవంబర్లోని పెరోల్ సమయంలో బర్నావా ఆశ్రమంలో అనేక ఆన్లైన్ ‘సత్సంగ్’లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొందరు హర్యానాకు చెందిన బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు.
Read Also: Cane Toad: వామ్మో.. ఇది విన్నారా.. ఆ కప్ప బరువు ఏకంగా 2.7కిలోలంట
ఇదే విషయంపై సిక్కుల అత్యున్నత మత సంస్థ శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు తరచుగా పెరోల్ ఇవ్వడం గురించి ప్రస్తావిస్తూ.. సుమారు మూడు దశాబ్దాలుగా జైళ్లలో ఉన్న సిక్కు ఖైదీలను వారి శిక్షలు పూర్తయినా విడుదల చేయడం లేదని SGPC అధ్యక్షుడు హర్జీందర్ సింగ్ ధామీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
-
Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
RRB Technician 2026: నిరుద్యోగులకు గోల్డెన్ చాన్స్.. రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు, అర్హత పూర్తి వివరాలు
-
Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
-
Luger : ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..! షాక్లో ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!