డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ పట్ల హర్యానా ప్రభుత్వం మరోసారి దయ చూపింది. ఇద్దరు భక్తులపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఈయనకు న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. ప్రస్తుతం జైల్లోనే ఉంటూ శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా డేరా సచ్చా సౌదా ఆశ్రమ అధిపతి గుర్మీత్ రాం రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా 13వ సారి జైలు నుంచి బయటకు వచ్చారు. బుధవారం ఉదయం, బాబాను పోలీసు రక్షణలో సిర్సా డేరాకు…
Dera Sacha Sauda: 2015 నాటి మూడు ఇంటర్లింక్డ్ బర్గారీ సాక్రిలేజ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్పై విచారణపై పంజాబ్ – హర్యానా హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. బర్గారీలో గురుగ్రంథ సాహిబ్ను అపవిత్రం చేశారనే ఆరోపణలపై గుర్మీత్ రామ్ రహీమ్పై జరుగుతున్న మూడు కేసుల్లో విచారణను మార్చిలో పంజాబ్ హర్యానా హైకోర్టు నిలిపివేసింది. ఈ ఉత్తర్వులను పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు…
డేరా సచ్చా సౌదా అధినేత గుర్మింత్ రామ్ రహీమ్ సింగ్ కు పంజాబ్-హర్యానా హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింద. రంజిత్ సింగ్ హత్య కేసులో అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది.
Gurmeet Ram Rahim Singh: అత్యాచారం, హత్య దోషి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరాబాబా)కి మరోసారి పెరోల్ మంజూరైంది. తాజాగా 50 రోజలు పాటు పెరోల్ లభించింది. గత నాలుగేళ్లలో ఆయనకు పెరోల్ రావడం ఇది 9వ సారి. అని పెరోల్ పొడగింపుకు హర్యానా సర్కార్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆయన రోహ్తక్లోని సునారియ జైలులో ఉన్నాడు. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో…
Dera Baba: అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా(55)కు కోర్టు 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. డేరా బాబా తన సిర్సా ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో హర్యానాలోని సనారియా జైలులో 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
Rakhis for Gurmeet Ram Rahim:హర్యానా డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రాహీమ్ సింగ్ కు ఇబ్బడిముబ్బడిగా రాఖీలు, గ్రీటింగ్ కార్డులు వచ్చిపడుతున్నాయి. దీంతో పోస్టల్ శాఖ వాటిని వేరు చేసేందుకు పగలు రాత్రి కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ ఏడాది రక్షా బంధన్ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డేరా బాబా భక్తులు రామ్ రహీమ్ సింగ్ కు వేలల్లో రాఖీలు పంపుతుంటారు. ప్రస్తుతం రోహ్ తక్ లోని సునారియా…