Pawan Kalyan: రోడ్డు ప్రమాదంలో అభిమానులు మృతి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్
- రోడ్డు ప్రమాదంలో అభిమానులు మృతి
- ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం
- రామస్వామిపేట రోడ్డు నిర్మాణంపై ఆరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్, మణికంఠ ప్రమాదానికి గురైన మరణించిన విషయం తెలిసిందే. రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతాన్ని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పిఠాపురం పర్యటనకు వెళ్తున్న ఆయన మార్గ మధ్యలో ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. ప్రమాదానికిగల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
READ MORE: Electricity Bill: ఓరి దేవుడా ఆ వ్యాపారికి ఏకంగా రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు..
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
మరోవైపు.. పిఠాపురం పర్యటనకు వెళ్తూ రామస్వామిపేట వద్ద ఏడీబీ రోడ్డు నిర్మాణం పనులు పరిశీలించారు. రోడ్డు నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అయ్యింది. ఎంత వరకు పూర్తయ్యింది? ప్రస్తుతం పనులు ఎలా సాగుతున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు వెంట కాలి నడకన వెళ్తూ డ్రెయిన్ సౌకర్యం, నిర్మాణం పనుల్లో నాణ్యతను పరిశీలించారు. కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి, ఇతర ఉన్నతాధికారులు ఆయన వెంట ఉన్నారు.
READ MORE: Bollywood : బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన విడాకులు ఎవరివో తెలుసా..?
ఇదిలా ఉండగా.. రాజమహేంద్రవరం శివారున ఈ నెల 4వ తేదీన రాంచరణ్ నటించిన గేమ్ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై తిరిగివెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కాకినాడకు చెందిన ఎ.మణికంఠ, టి.చరణ్ల కుటుంబ సభ్యులను ఇటీవల సినీ నిర్మాత దిల్ రాజు తరపున ప్రతినిధుల బృందం పరామర్శించింది. మైత్రి ఫిలింస్ తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు ఉదయ్రాజు, రాయుడు, లైన్ ప్రొడ్యూసర్ కాకినాడ బాబీ, సినీ నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి, జనసేన జగ్గంపేట ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ తదితరుల చేతుల మీదుగా ఇరు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించారు.
READ MORE: Gold Rate Today: వరుసగా మూడోరోజు బాదుడే.. హైదరాబాద్లో తులం బంగారం ఎంతంటే?
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!