Pawan Kalyan: రోడ్డు ప్రమాదంలో అభిమానులు మృతి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్
- రోడ్డు ప్రమాదంలో అభిమానులు మృతి
- ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం
- రామస్వామిపేట రోడ్డు నిర్మాణంపై ఆరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్, మణికంఠ ప్రమాదానికి గురైన మరణించిన విషయం తెలిసిందే. రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతాన్ని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పిఠాపురం పర్యటనకు వెళ్తున్న ఆయన మార్గ మధ్యలో ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. ప్రమాదానికిగల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
READ MORE: Electricity Bill: ఓరి దేవుడా ఆ వ్యాపారికి ఏకంగా రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు..
Also Read
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
మరోవైపు.. పిఠాపురం పర్యటనకు వెళ్తూ రామస్వామిపేట వద్ద ఏడీబీ రోడ్డు నిర్మాణం పనులు పరిశీలించారు. రోడ్డు నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అయ్యింది. ఎంత వరకు పూర్తయ్యింది? ప్రస్తుతం పనులు ఎలా సాగుతున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు వెంట కాలి నడకన వెళ్తూ డ్రెయిన్ సౌకర్యం, నిర్మాణం పనుల్లో నాణ్యతను పరిశీలించారు. కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి, ఇతర ఉన్నతాధికారులు ఆయన వెంట ఉన్నారు.
READ MORE: Bollywood : బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన విడాకులు ఎవరివో తెలుసా..?
ఇదిలా ఉండగా.. రాజమహేంద్రవరం శివారున ఈ నెల 4వ తేదీన రాంచరణ్ నటించిన గేమ్ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై తిరిగివెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కాకినాడకు చెందిన ఎ.మణికంఠ, టి.చరణ్ల కుటుంబ సభ్యులను ఇటీవల సినీ నిర్మాత దిల్ రాజు తరపున ప్రతినిధుల బృందం పరామర్శించింది. మైత్రి ఫిలింస్ తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు ఉదయ్రాజు, రాయుడు, లైన్ ప్రొడ్యూసర్ కాకినాడ బాబీ, సినీ నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి, జనసేన జగ్గంపేట ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ తదితరుల చేతుల మీదుగా ఇరు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించారు.
READ MORE: Gold Rate Today: వరుసగా మూడోరోజు బాదుడే.. హైదరాబాద్లో తులం బంగారం ఎంతంటే?
తాజావార్తలు
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
-
Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
-
Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!