NTV Telugu Site icon

Devendra Fadnavis : కావాలనే రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారు..

Fadnavis

Fadnavis

మహారాష్ట్రలోని అకోలాలో సోషల్ మీడియాలో పోస్ట్‌పై మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని శక్తులు ప్రేరేపిస్తున్నాయి అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రయత్నాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, అయితే ఈ ప్రయత్నాలు ఫలించవని, ప్రభుత్వం వీటిని అణిచి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సంఘ వ్యతిరేక శక్తులకు తగిన గుణపాఠం చెబుతామని ఆయన వెల్లడించారు. దీని వెనుక (రాజకీయంగా ప్రేరేపించబడింది) కొన్ని సంస్థలు దీని వెనుక ఉన్నాయి అని డిప్యూటీ సీఎం అన్నారు.

Also Read : Ramcharan: మండు వేసవిలో చల్లటి స్ఫూర్తి పంచుతున్న రామ్‌చరణ్‌ ఫ్యాన్స్!

మహారాష్ట్రలో ఇటీవలి హింసాత్మక సంఘటనలపై ఫడ్నవీస్ స్పందిస్తూ, సరైన సమయంలో పోలీసులు జోక్యం చేసుకున్నందున అల్లర్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో శాంతిభద్రతల విఘాతం కలుగకుండా తగిన చర్యలు తీసుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నావీస్ అన్నారు. పోలీసులు అలర్ట్ గా ఉన్నారని, ఇతర ప్రాంతాల నుంచి అదనపు భద్రతా బలగాలను అక్కడ మోహరించినట్లు ఆయన చెప్పారు.

Also Read : IPL 2023 : గుజరాత్ తో పోటీకి సై అంటున్న సన్ రైజర్స్

అసలు ఏం జరిగిందంటే.. మహారాష్ట్రలోని అకోలా నగరంలో శనివారం ఒక మత గురువు గురించి సోషల్ మీడియా పోస్ట్‌పై రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరు పోలీసులతో సహా మరో 10 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక వర్గానికి చెందిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను అప్‌లోడ్ చేశాడు.. ఇది మరొక సంఘం మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపిస్తూ పాత నగరం హరిహరపేటలో ఘర్షణలు జరిగాయి.

Also Read : Krithi Shetty: దెబ్బ మీద దెబ్బ.. బేబమ్మకి ఏమైంది?

ఈ ఘటన తర్వాత నగరంలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం సిఆర్‌పిసి సెక్షన్ 144 విధించింది. అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు మూడు వేర్వేరు కేసులు నమోదు చేసి 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉందని అకోలా అదనపు ఎస్పీ మోనికా రౌత్ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ఔరగాబాద్‌లోని ఒక దేవాలయం సమీపంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పరిస్థితిని నియంత్రించడానికి వెళ్లిన పోలీసులపైకి సుమారు 500 మందితో కూడిన ఓ గుంపు రాళ్లు, పెట్రోల్ నింపిన బాటిళ్లను విసిరారు.. దీంతో 10 మంది పోలీసులతో పాట మరో 12 మంది గాయపడ్డారు.