Delhi: ఢిల్లీలో ఓ మహిళ మూడేళ్లపాటు 14కుక్కలను ప్లాట్లో బంధించి ఘోరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశ రాజధాని ఢిల్లీ దారుణం చోటు చేసుకుంది. అక్కడి అత్యంత పాష్ ఏరియా గ్రేటర్ కైలాష్లో విచిత్రమైన కేసు తెరపైకి వచ్చింది. మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ మహిళ గత మూడేళ్లుగా తన ఫ్లాట్లో దాదాపు 14 వీధి కుక్కలను బందీలుగా ఉంచింది. వాటికి సరైన ఆహారం అందకపోవడంతో కుక్కల పరిస్థితి దిగజారింది. కుక్కలన్నీ చాలా అనారోగ్యంతో బలహీనంగా మారాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలను ఢిల్లీ పోలీస్ డిసిపి చందన్ చౌదరి తెలియజేస్తూ.. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో అపరిశుభ్రత, దుర్వాసన వస్తుందని పొరుగువారు తరచూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. దీంతో ఢిల్లీ పోలీసు బృందం ఆ ఫ్లాట్కు చేరుకుంది. అయితే అక్కడ ఉన్న మహిళ చాలా ప్రాధేయపడినప్పటికీ, కుక్కను పోలీసులకు అప్పగించడానికి నిరాకరించింది.
Read Also:Adipurush: ఆదిపురుష్ సినిమాకి వెళ్లిన కొత్త జంట.. ఇంటర్వెల్లో భర్తకు షాకిచ్చిన భార్య
Also Read
పోలీసులు సెర్చ్ వారెంట్ పొందారు. MCD, SPCAలను కలిపి జాయింట్ టీంను ఏర్పాటు చేశారు. ఈ ఉమ్మడి బృందం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని ఆ ఫ్లాట్కు చేరుకుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఐహెచ్బిఎఎస్) బృందం కూడా హాజరైంది. పోలీసులు ఇంట్లోకి రాగానే లోపలి దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఫ్లాట్ లోపల చీకటిగా ఉందని డీసీపీ చౌదరి తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫ్లాట్లో దాదాపు 14 కుక్కలు చనిపోతున్న స్థితిలో పడి ఉన్నాయి. ఇంటి లోపల చాలా అపరిశుభ్రత ఉంది. దుర్వాసన వెదజల్లడంతో నిలబడేందుకు ఇబ్బందిగా ఉంది. పోలీసులు సెర్చ్ వారెంట్ చూపించి మహిళకు ఎలాగోలా వివరించి, అక్కడ ఉన్న కుక్కలను వెటర్నరీ డాక్టర్ సమక్షంలో జంతు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఐహెచ్బిఎఎస్ బృందం ఆ మహిళకు కౌన్సెలింగ్ కూడా చేసింది. కుక్కలను పోలీసులు విజయవంతంగా రక్షించడంతో ఇరుగుపొరుగు వారు ఊపిరి పీల్చుకున్నారు. ఒక మహిళ తన ఫ్లాట్లో 3 సంవత్సరాల పాటు 14 కుక్కలను ఎలా బందీలుగా ఉంచుతుందని ఈ సంఘటనతో ఆయన ఆశ్చర్యపోయాడు.
Read Also:Modi surname case: రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు.. నేడు హైకోర్టు కీలక తీర్పు..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!