Air Pollution: నేటి నుంచి ‘నో పీయూసీ, నో ఫ్యూయల్’ నిబంధన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Enforces ‘No PUC, No Fuel’ Rule as Air Pollution Turns Severe: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రంగా మారింది. దీని దృష్ట్యా, ఢిల్లీ ప్రభుత్వం, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. గురువారం నుంచి ఢిల్లీలో “నో పియుసి, నో ఫ్యూయల్” నియమం అమల్లోకి వస్తుంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్జీ అందించరు. ఢిల్లీ కాకుండా ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రార్ అయిన BS-VI కంటే తక్కువ ఉద్గార ప్రమాణాలు కలిగిన వాహనాల ప్రవేశం రాజధానిలోకి పూర్తిగా నిషేధం విధించారు. ఈ ఉత్తర్వు పర్యావరణ (రక్షణ) చట్టం, 1986లోని సెక్షన్ 5 కింద జారీ చేశారు. GRAP స్టేజ్ IV (తీవ్రమైన+) అమలులో ఉన్నంత వరకు అమలులో ఉంటుంది. శీతాకాలంలో ఢిల్లీలో గాలి చాలా విషపూరితంగా మారుతుందని, PM2.5, PM10 స్థాయిలు నిర్దేశించిన ప్రమాణాలను చాలా రెట్లు మించిపోతాయని ప్రభుత్వం చెబుతోంది.
READ MORE: GHMC Ward Delimitation: వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు.. అసలు ప్రాబ్లం ఏంటి?
Also Read
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
ఢిల్లీ-ఎన్సిఆర్లో బీఎస్-IV ఉద్గార ప్రమాణాల కంటే తక్కువ ఉన్న పాత వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు బుధవారం తన ఉత్తర్వులను సవరించింది. బీఎస్-III, పాత వాహనాలు కాలుష్య స్థాయిలు పెరగడానికి దోహదం చేస్తున్నాయని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోవడానికి కోర్టు అనుమతి కోరింది. దీంతో కోర్టు సమ్మతించింది. ఇక వాహనదారులు ఢిల్లీలోని అన్ని పెట్రోల్, డీజిల్, CNG పంపుల్లో PUC సర్టిఫికేట్ సమర్పించిన తర్వాతే ఇంధనాన్ని పంపిణీ చేయాలని ఆదేశించారు. PUC లేకుండా ఇంధనాన్ని అందిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. భౌతిక ధృవపత్రాలు, ANPR (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు, వాహన్ డేటాబేస్, వాయిస్ అలర్ట్ సిస్టమ్, పోలీసులను ఉపయోగించి PUC ధృవీకరణ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. నిర్మాణ కార్యకలాపాలు కాలుష్యానికి దోహదపడుతున్నందున, ఇసుక, కంకర, రాయి, ఇటుకలు, సిమెంట్, రెడీ-మిక్స్ కాంక్రీట్, శిథిలాలు వంటి నిర్మాణ సామగ్రిని మోసుకెళ్లే ఏ వాహనాన్ని కూడా ఢిల్లీలోకి ప్రవేశించకుండా పూర్తిగా నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వాహనాలను స్వాధీనం చేసుకోవడం, భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!