Bomb Threat : ఢిల్లీ నుంచి బెంగుళూరు స్కూళ్లకు పాకిన బాంబు బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat : ఢిల్లీ-ఎన్సీఆర్లోని 80కి పైగా పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు తర్వాత ఢిల్లీ పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు పాఠశాలలకు చేరుకున్నాయి. పాఠశాలలు విద్యార్థులను హడావుడిగా ఇళ్లకు పంపించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ మాదిరిగానే బెంగళూరులో కూడా ఐదు నెలల క్రితం ఏకకాలంలో 48 పాఠశాలలపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి.
డిసెంబర్ 1, 2023న 48 ప్రైవేట్ పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలల్లో బాంబులు అమర్చినట్లు అన్ని పాఠశాలలకు ఏకకాలంలో ఈ-మెయిల్ వచ్చింది. దీనిపై సమాచారం అందిన వెంటనే పాఠశాలలు విద్యార్థులను, సిబ్బందిని క్యాంపస్ నుంచి ఖాళీ చేయించారు. బాంబు సమాచారం అందిన వెంటనే తల్లిదండ్రులంతా తమ పిల్లలను తీసుకెళ్లేందుకు రావడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ పాఠశాలల్లో సోదాలు ప్రారంభించారు. అయితే విచారణలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.
Also Read
- August 15 History: ఆగస్టు 15.. భారత్కే కాదు ఈ 3 సరిహద్దు దేశాల చరిత్రలోనూ కీలక రోజే!
- Modi-Rahman: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
- Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
- Monsoon Alert: ఆగస్టులో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో వరస అల్పపీడనాలు..
Read Also:Margani Bharat Ram: కూటమి మేనిఫెస్టోను బీజేపీ కనీసం ముట్టుకోలేదు.. వైసీపీ సెటైర్లు
ఈ-మెయిల్లో ఏం రాశారు?
ఈ మెయిల్ harijites@beeble.com ID నుండి వచ్చింది. ముజాహిదీన్ పేరుతో పంపబడింది. ఇందులో అందరూ అల్లాకు బానిసలు అవుతారని బెదిరించారు. అందరూ ఇస్లాం స్వీకరించేందుకు సిద్ధం కావాలని, లేకుంటే అందరూ చనిపోవడానికి సిద్ధంగా ఉండాలని ఈమెయిల్లో రాసింది. నిన్ను, నీ పిల్లలను చంపేస్తాం. మీరందరూ కూడా అల్లాహ్ కు వ్యతిరేకులు, మీరు అవిశ్వాసులు అని పేర్కొన్నారు.
పాఠశాలలను పరిశీలించేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా వచ్చారు. ఈ మెయిల్ను పుకారుగా పేర్కొన్న డీకే శివకుమార్ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. డీపీఎస్ ద్వారక, వసంత్ కుంజ్ డీపీఎస్, డీపీఎస్ మధుర రోడ్, మయూర్ విహార్ మదర్ మేరీ స్కూల్, న్యూ ఢిల్లీ సంస్కృతి స్కూల్, డీఏవీ స్కూల్ ఆఫ్ సౌత్ ఢిల్లీ, అమిటీ స్కూల్ ఆఫ్ పుష్ప్ విహార్, డీఏవీ మోడల్ టౌన్, దేవ్ స్కూల్ ఆఫ్ వికాస్పురి, సాల్వాన్ పబ్లిక్ స్కూల్ ఆఫ్ నారాయణ, హరినగర్లోని గురు హరికిషన్ పబ్లిక్ స్కూల్తో సహా అనేక ఉన్నత పాఠశాలలకు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ-NCRలోని దాదాపు అన్ని పాఠశాలలు మూసివేయబడ్డాయి.
Read Also:Tamil Nadu Blast: తమిళనాడులో భారీ బాంబ్ బ్లాస్ట్.. నలుగురు మృతి
తాజావార్తలు
-
Independence Day : పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం..
-
Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్గా అదరగొట్టేశాడు!
-
August 15 History: ఆగస్టు 15.. భారత్కే కాదు ఈ 3 సరిహద్దు దేశాల చరిత్రలోనూ కీలక రోజే!
-
Modi-Rahman: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
-
Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!