Delhi Air Quality: ఢిల్లీలో మరింత క్షీణించిన వాయు నాణ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ఎక్కువైంది. ఢిల్లీలో ఎన్సీఆర్ పరిధిలో వాయు నాణ్యత నానాటికి క్షీణిస్తుంది. గత 4 రోజులుగా గాలి నాణ్యత సూచిక(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్-AQI) 300 పైనే ఉండడం గమనార్హం. ఆదివారం ఉదయం ఏక్యూఐ 350గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 4 వందలు దాటిపోటిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా ఆనంద్ విహార్లో ఏఐక్యూ 469గా ఉండగా, వజీర్పూర్లో 417, ముండ్కాలో 392, ఢిల్లీలో 385, ఆర్కే పురంలో 376, ఐటీఓ వద్ద 374, ఓఖ్లా ఫేజ్-2 వద్ద 370గా గాలి నాణ్యత నమోదైంది. వాయు ప్రమాణాలు క్షీణిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా వీలవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
న్యూ ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గుతున్న నేపథ్యంలో ఇండియా గేట్ వద్ద మార్నింగ్ వాకర్లు, సైక్లిస్టులు, జాగర్లు గాలి నాణ్యతలో తగ్గుదల కారణంగా ప్రభావితమయ్యారు. ఈనేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఎన్సీఆర్లో చర్యలకు ఉపక్రమించడంతో పాటు ప్రజలకు కీలక సూచనలు చేసింది. వీలైనంత వరకు ఉద్యోగాలు ఇంటి నుంచి పని చేయాలని, వాయు కాలుష్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఎంపిక చేసిన సేవలు మినహా అన్ని విభాగాల్లో నిర్మాణ పనులుపై నిషేధం విధించింది. రైల్వే స్టేషన్లు, మెట్రో, దవాఖానాలు, విమానాశ్రయాలు తదితర విభాగాలను ఆంక్షల నుంచి సడలించింది. ప్రజలు రవాణా కోసం షేరింగ్ వాహనాలను ఉపయోగించాలని కమిషన్ విజ్ఞప్తి చేసింది. సైకిల్స్ను వినియోగించాలని, వీలైనంత వరకు ఇంట్లో నుంచి పని చేసుకోవాలని కోరింది.
Also Read
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
Tamilnadu: కోయంబత్తూరు పేలుళ్ల కేసు ఎన్ఐఏకు అప్పగింత
రాజస్థాన్లోని 45 బొగ్గు ఆధారిత పారిశ్రామిక యూనిట్లను మూసివేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా,32 బొగ్గు ఆధారిత యూనిట్లు (హర్యానాలో 9 యూపీలో 23) శాశ్వతంగా మూసివేయబడ్డాయి. 48 యూనిట్లు (హర్యానాలో 8, యూపీలో 40) ఈ యూనిట్లను ఆమోదించబడిన ఇంధనాలుగా మార్చే వరకు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.
తాజావార్తలు
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!