Delhi murder case: ఢిల్లీలో సంచలనం.. సంచిలో డెడ్ బాడీ.. కిల్లర్ను పట్టించిన ట్యాటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi murder case: దేశ రాజధానిలో సంచలన ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలోని దాబ్రీ ప్రాంతంలో ఒక యువతి మృతదేహం గోనె సంచిలో కనిపించడంతో ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించడం మొదలు పెట్టారు. ఈక్రమంలో నిందితుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన సలీంగా గుర్తించి అరెస్టు చేశారు.
READ ALSO: allergy death: అలర్జీ ఎంత పని చేసిందంటే.. 22 ఏళ్ల అమ్మాయి 24 గంటల్లో మృతి
Also Read
- Aman Rao Perala: ఎవరయ్యా వైభవ్ సూర్యవంశీ.? 32 బంతుల్లో సెంచరీ చేసిన హైదరాబాద్ బ్యాటర్.!
- Rare Fish: అంతర్వేదిలో అరుదైన ఫిష్.. మత్స్యకారులకు అదృష్టాన్ని తెచ్చిన 'మగ కచిడి చేప'!
- Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు లాక్కోవడమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు
- GEN Z పిల్లలు Vaibhav Sooryavanshiని చూసి నేర్చుకోండి.. వైభవ్పై ప్రధాని మోడీ ప్రశంసలు.!
అసలు ఏం జరిగిందంటే..
ఈసందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఆగస్టు 23 మధ్యాహ్నం 2:54 గంటల ప్రాంతంలో ద్వారకా-దబ్రీ ప్రాంతంలోని డ్రెయిన్ దగ్గర అనుమానాస్పద సంచి దొరికిందని దబ్రీ పోలీస్ స్టేషన్కు సమాచారం వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ సంచిలో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలిని(20) ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు సహాయంతో గుర్తించినట్లు తెలిపారు. ఆమె ఆగస్టు 21న తప్పిపోయినట్లు మృతిరాలి తల్లి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక నిఘా ఆధారంగా సలీంను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు మృతురాలితో కలిసి ఒక భవనంలోకి ప్రవేశించి, తరువాత ఒంటరిగా వెళ్లిపోయాడని, ఆమె శరీరాన్ని ఒక సంచిలో మోసుకెళ్లడం ఫుటేజ్లో కనిపించిందని పేర్కొన్నారు. మృతి చెందిన అమ్మాయికి నిందితుడు సలీంకు ముందు నుంచీ పరిచయం ఉందని, ఆమె ఆగస్టు 21న సలీంను కలవడానికి వెళ్లిందన్నారు. అప్పుడు ఆ అమ్మాయి నిందితుడిని తన దగ్గరి నుంచి గతంలో తీసుకున్న డబ్బు ఇవ్వాలని అడిగిందని, దీంతో వాళ్లిద్దరి మధ్య డబ్బు విషయంలో వాగ్వాదం జరిగి, కోపంతో సలీం ఆమెను గొంతు కోసి చంపాడని తెలిపారు. హత్య తర్వాత నిందితుడు మృతదేహాన్ని ఒక సంచిలో వేసి తన బైక్పై తీసుకెళ్లి దాబ్రీ సమీపంలోని కాల్వలో పడేయడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో మృతదేహం జారిపడి రోడ్డుపైన వెళ్లే వారి దృష్టిని ఆకర్షించింది. వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
యూపీలో అరెస్టు..
నిందితుడిని పట్టుకోవడానికి అనేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. హార్డయ్లో నిందితుడు ఉన్నట్లు సమాచారం రావడంతో వెంటనే పోలీసులు బృందాలు అక్కడికి వెళ్లి అతన్ని అరెస్టు చేశాయి. నిందితుడిని పట్టించడంలో బాలిక చేతిలో ఉన్న పచ్చబొట్టు కీ రోల్ ప్లే చేసిందని అధికారులు తెలిపారు.
READ ALSO: TMC MLA escapes ED: ఈడీకి భయపడి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన ఎమ్మెల్యే..
తాజావార్తలు
-
Nara Rohith : వారసుడొచ్చాడు.. తండ్రయిన నారా రోహిత్!
-
2027 Sankranthi : టాలీవుడ్ సీనియర్స్ వర్సెస్ కోలీవుడ్ స్టార్స్!
-
Sunil Gavaskar-BCCI: ఎవడుపడితే వాడు జట్టులోకి వస్తుండు.. బీసీసీఐపై సునీల్ గవాస్కర్ ఫైర్!
-
CM Vijay: విజయ్కి మద్దతుగా యువ హీరో హాట్ హాట్ కామెంట్స్
-
Aman Rao Perala: ఎవరయ్యా వైభవ్ సూర్యవంశీ.? 32 బంతుల్లో సెంచరీ చేసిన హైదరాబాద్ బ్యాటర్.!
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!