Delhi murder case: ఢిల్లీలో సంచలనం.. సంచిలో డెడ్ బాడీ.. కిల్లర్ను పట్టించిన ట్యాటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi murder case: దేశ రాజధానిలో సంచలన ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలోని దాబ్రీ ప్రాంతంలో ఒక యువతి మృతదేహం గోనె సంచిలో కనిపించడంతో ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించడం మొదలు పెట్టారు. ఈక్రమంలో నిందితుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన సలీంగా గుర్తించి అరెస్టు చేశారు.
READ ALSO: allergy death: అలర్జీ ఎంత పని చేసిందంటే.. 22 ఏళ్ల అమ్మాయి 24 గంటల్లో మృతి
Also Read
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Suryakumar Yadav: పాకిస్థాన్తో మ్యాచ్లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
అసలు ఏం జరిగిందంటే..
ఈసందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఆగస్టు 23 మధ్యాహ్నం 2:54 గంటల ప్రాంతంలో ద్వారకా-దబ్రీ ప్రాంతంలోని డ్రెయిన్ దగ్గర అనుమానాస్పద సంచి దొరికిందని దబ్రీ పోలీస్ స్టేషన్కు సమాచారం వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ సంచిలో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలిని(20) ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు సహాయంతో గుర్తించినట్లు తెలిపారు. ఆమె ఆగస్టు 21న తప్పిపోయినట్లు మృతిరాలి తల్లి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక నిఘా ఆధారంగా సలీంను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు మృతురాలితో కలిసి ఒక భవనంలోకి ప్రవేశించి, తరువాత ఒంటరిగా వెళ్లిపోయాడని, ఆమె శరీరాన్ని ఒక సంచిలో మోసుకెళ్లడం ఫుటేజ్లో కనిపించిందని పేర్కొన్నారు. మృతి చెందిన అమ్మాయికి నిందితుడు సలీంకు ముందు నుంచీ పరిచయం ఉందని, ఆమె ఆగస్టు 21న సలీంను కలవడానికి వెళ్లిందన్నారు. అప్పుడు ఆ అమ్మాయి నిందితుడిని తన దగ్గరి నుంచి గతంలో తీసుకున్న డబ్బు ఇవ్వాలని అడిగిందని, దీంతో వాళ్లిద్దరి మధ్య డబ్బు విషయంలో వాగ్వాదం జరిగి, కోపంతో సలీం ఆమెను గొంతు కోసి చంపాడని తెలిపారు. హత్య తర్వాత నిందితుడు మృతదేహాన్ని ఒక సంచిలో వేసి తన బైక్పై తీసుకెళ్లి దాబ్రీ సమీపంలోని కాల్వలో పడేయడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో మృతదేహం జారిపడి రోడ్డుపైన వెళ్లే వారి దృష్టిని ఆకర్షించింది. వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
యూపీలో అరెస్టు..
నిందితుడిని పట్టుకోవడానికి అనేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. హార్డయ్లో నిందితుడు ఉన్నట్లు సమాచారం రావడంతో వెంటనే పోలీసులు బృందాలు అక్కడికి వెళ్లి అతన్ని అరెస్టు చేశాయి. నిందితుడిని పట్టించడంలో బాలిక చేతిలో ఉన్న పచ్చబొట్టు కీ రోల్ ప్లే చేసిందని అధికారులు తెలిపారు.
READ ALSO: TMC MLA escapes ED: ఈడీకి భయపడి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన ఎమ్మెల్యే..
తాజావార్తలు
-
Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య – గోపించంద్ మలినేని సినిమాకు రెండు టైటిల్స్ లాక్
-
Suryakumar Yadav: పాకిస్థాన్తో మ్యాచ్లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!