TMC MLA escapes ED: ఈడీకి భయపడి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC MLA escapes ED: బూచోళ్లను చూసి చిన్నపిల్లలు పారిపోయినట్లు.. ఈడీని చూసి అవినీతి ప్రజాప్రతినిధులు దడుచుకుంటున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఓ ఎమ్మెల్యే వాళ్ల ఇంటికి దర్యాప్తు కోసం వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులను చూసి వెంటనే ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయటికి దూకి పారిపోడానికి ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా తన ఫోన్ను వెంటనే సమీపంలోని డ్రైనేజీలో విసిరేశాడు. వచ్చిన వాళ్లు సాధారణ వ్యక్తులా ఆయన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టడానికి.. వెంటపడి మరి పెట్టుకున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, దీని వెనుక ఉన్న కారణాలు ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Team India: ఛెతేశ్వర్ పుజారా తర్వాత ఎవరు?.. రిటైర్మెంట్ లిస్టులో ‘ఆ నలుగురు’!
Also Read
- Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
- Rajnath Singh: భారత్కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
- Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
ఎమ్మెల్యే అరెస్ట్…
పశ్చిమ బెంగాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాల్లో జరిగిన కుంభకోణంపై ED దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ముర్షిదాబాద్ జిల్లా బుర్వాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహాను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తు కోసం వెళ్లిన ఈడీ అధికారులను చూసి ఎమ్మెల్యే వాళ్ల ఇంటి ఫస్ట ఫ్లోర్ నుంచి కిందకి దూకి పారిపోడానికి ప్రయత్నించారు. కానీ అధికారులు ఆయనను పట్టుకున్నారు, ఆయన తన ఫోన్ను అధికారులకు దొరకకుండా చేయడానికి సమీపంలోని డ్రైనేజీలోకి విసిరేశారు. కానీ ఈడీ అధికారులు వెంటనే దాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో, అతని సన్నిహితుల రహస్య ప్రదేశాలలో ఈడీ ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈక్రమంలో ఈడీ అధికారులు ఆయనను అరెస్ట చేసి విచారణకు తీసుకెళ్లారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాల్లో జరిగిన కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. దర్యాప్తులో బిర్భూమ్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి డబ్బు లావాదేవీలు జరిపినట్లు సమాచారం ఉందని, ఆ సమాచారం ఆధారంగానే దాడులు చేస్తున్నట్లు తెలిపారు. బిర్భూమ్ జిల్లాకు చెందిన ఒకరు ఈ రోజు ఉదయం ED అధికారులతో కలిసి ఎమ్మెల్యే సాహా నివాసానికి వెళ్లారు. గతంలో ఈ కుంభకోణానికి సంబంధించి ఎమ్మెల్యే సాహా భార్యను కూడా ఈడీ ప్రశ్నించింది.
READ ALSO: allergy death: అలర్జీ ఎంత పని చేసిందంటే.. 22 ఏళ్ల అమ్మాయి 24 గంటల్లో మృతి
తాజావార్తలు
-
Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
-
Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. “దాగుడు మూతలు దండాకోర్” అంటూ సంక్రాంతికి?
-
Onkar Batra: 7ఏళ్లకే వెబ్సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!
-
Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
-
Rajnath Singh: భారత్కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!