Delhi Liquor Scam: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ మళ్లీ వాయిదా
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సిసోడియా తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆయన విచారణకు సహకరిస్తున్నారని, కస్టోడియల్ విచారణ అవసరం లేదని కోర్టుకు తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో సిసోడియా కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు మంగళవారం విచారణ జరిపింది.
మనీష్ సిసోడియా ముడుపులు తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని, సోదాల్లోనూ ఆయనకు వ్యతిరేకంగా ఏమీ లభించలేదని సిసోడియా తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఆయన విచారణకు పూర్తిగా సహకరిస్తు్న్నారని, విదేశాలకు పారిపోయే ముప్పు లేదని.. అందువల్ల ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదన్నారు. ఇక మనీష్ సిసోడియా భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన కుమారుడు విదేశాల్లో చదువుతున్నాడని.. ఈ నేపథ్యంలో భార్యను చూసుకోవాల్సిన బాధ్యత సిసోడియాపై ఉందని మనీష్ సిసోడియా తరఫు న్యాయవాది వాదించారు.
Also Read
- Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
- Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
- Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
- Stop SIP: మార్కెట్ పడిపోతుందని SIP ఆపేస్తున్నారా..? అయితే మీరు కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే..
Read Also: Medvedev: ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి, క్షిపణి రావచ్చు.. ఐసీసీకి మెద్వెదేవ్ వార్నింగ్
బెయిల్ పిటిషన్ను సీబీఐ వ్యతిరేకించింది. సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు కేసులో సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను మార్చి 24వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారించిన తర్వాత మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరిచింది. ఇదే వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఈడీ, జైలులో ఉన్న మనీష్ సిసోడియాను ఇటీవల తన కస్టడీలోకి తీసుకుంది. ఈ నెల 22 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ కేసులోనూ బెయిల్ కోరుతూ ఆయన దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు.. సిసోదియా బెయిల్ అభ్యర్థనపై మార్చి 25లోగా సమాధానం ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో సిసోదియా ఏప్రిల్ 3 వరకు జైల్లోనే ఉండనున్నారు.
తాజావార్తలు
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
-
Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
-
Microsoft’s ‘Rule of 70’: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. మైక్రోసాఫ్ట్ తెచ్చిన ‘రూల్ ఆఫ్ 70’ వెనుక అసలు కథ ఇదే!
-
TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!
-
NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. 35 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!