Union Cabinet: ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Cabinet: ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఢిల్లీ పేలుళ్లను ఉగ్రవాద సంఘటనగా గుర్తించి, కేబినెట్ సమావేశంలో బాధితులకు నివాళులర్పించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం.. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని మంత్రి వర్గం రెండు నిమిషాలు మౌనం పాటించింది.
READ MORE: SSMB29: రాజమౌళి లీక్ స్ట్రాటజీ మాములుగా లేదుగా.. ‘సంచారి’ సాంగ్ వెనక మైండ్ గేమ్..?
Also Read
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
ఈ కేబినెట్ భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. 2025 నవంబర్ 10 సాయంత్రం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన దేశ వ్యతిరేక శక్తులు చేసిన దారుణమైన ఉగ్రవాద సంఘటనను దేశం చూసింది. ఈ పేలుడు ఫలితంగా ప్రాణ, ఆర్థిక నష్టం జరిగిందని తెలిపారు. బాధితులకు మంత్రివర్గం హృదయపూర్వక నివాళులు అర్పించిందని చెప్పారు. “మంత్రి వర్గం మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తోంది. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది. బాధితుల సహాయం చేస్తున్న వైద్య సిబ్బంది, తదితర సిబ్బందిని అభినందించింది. అమాయకుల ప్రాణనష్టానికి దారితీసిన ఈ దుర్మార్గపు, పిరికి చర్యను మంత్రివర్గం నిస్సందేహంగా ఖండిస్తుంది. ఈ ప్రతికూల పరిస్థితులలో ధైర్యం, కరుణతో సేవలు చేసిన అధికారులు, భద్రతా సంస్థలు, పౌరులను మంత్రివర్గం ప్రశంసించింది. ఈ సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. నేరస్థులు, వారికి సహకరించిన వ్యక్తులు, స్పాన్సర్లను త్వరగా గుర్తించాలని ఆదేశిస్తోంది. ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంటుంది. జాతీయ భద్రత, ప్రతి పౌరుడి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Educated Terrorists: 24 ఏళ్లలో 36 సంఘటనలు.. ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ ఎప్పుడు ప్రారంభమైంది!
తాజావార్తలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!