INS Sandhayak: ఐఎన్ఎస్ సంధాయక్ను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INS Sandhayak: విశాఖలో ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. విశాఖలోని నేవల్ డాక్ యార్డులో తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను కేంద్ర మంత్రి జాతికి అంకితమిచ్చారు. నేవీ అవసరాల కోసం ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను ఉపయోగించనున్నారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే సరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో కోల్కతాలోని గార్డెన్రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ ఐఎన్ఎస్ సంధాయక్ను నిర్మించింది. ఈ ఐఎన్ఎస్ సంధాయక్ నౌక 3,800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుతో.. హెలిపాడ్, సర్వే పరికరాలు, రెండు డీజిల్ యంత్రాలను కలిగి ఉంది.
Read Also: Advani: అద్వానీకి భారతరత్న
Also Read
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
- Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ 'రాగి మిల్క్'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
తాజాగా ఐఎన్ఎస్ సంధాయక్ నౌకను రాజ్నాథ్ సింగ్ అంకితమిచ్చారు. సంధాయక్ నౌకకు కమాండింగ్ అధికారిగా కెప్టెన్ ఆర్.ఎం.థామస్ వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి, వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్క పాల్గొన్నారు. భారత నౌకాదళ అమ్ములపొదిలో ఐఎన్ఎస్ సంధాయక్ జలప్రవేశం సంతోషకరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత నౌకాదళం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు. ప్రపంచ సముద్ర జలాల్లో కూడా భారత నౌకాదళం కీలక భద్రత చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్కు 8 వేల నాటికల్ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలను కూడా నౌకాదళం అదుపు చేసిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత నౌకాదళానికి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనది. హిందూ మహాసముద్ర జలాల్లో శాంతిని కాపాడేందుకు ఐఎన్ఎస్ సందాయక్ ఉపకరిస్తుంది. దేశీయంగా యుద్ధ నౌక తయారీలో చరిత్ర సృష్టించడం ఆనందంగా వుంది. ఇటీవల రెండు విదేశీ నౌకలను సముద్రంలో వేలమైళ్ల దూరంలో సముద్రపు దొంగల బారిన, వారి చెర నుంచి కాపాడిన ఘనత భారత నౌకా దళానిది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా తిరిగిందుకు భారత నౌకలు తన వంతుగా పూర్తి సహకారాన్ని అందరికీ అందిస్తుంది.హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలకు అవసరమైన భద్రతను ఇండియన్ నేవీ కల్పిస్తోంది. భారతదేశం ప్రధానమైన లక్షమైన శాంతి సామరస్యం అంతర్జాతీయ జలాల్లో కూడా ఇది కాపాడే విధంగా భారత తన వంతు పాత్రను సహకారాన్ని పోషిస్తుంది. మన విజ్ఞానమే మన శక్తి. ఇదే అన్ని రంగాల్లోనూ మనం నిరూపిస్తున్నాం.” అని రక్షణ మంత్రి అన్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
-
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
-
China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
-
DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!