చైనాలోని ఓ ఆస్పత్రిలో దుండగుడు కత్తులతో వీరవిహారం చేశాడు. కనిపించిన వారిని తెగ నరికాడు. సంఘటనాస్థలిలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 10కి చేరినట్లుగా చైనా మీడియా తెలిపింది. యున్నాన్ ప్రావిన్సులో ఈ ఘోరం జరిగింది.
ఇది కూడా చదవండి: Rajamouli: ‘బాహుబలి’ని మీరే చంపుకుంటున్నారా ? అంటే జక్కన్న సమాధానం ఇదే!
ఝావోటాంగ్ నగరంలో ఉన్న ఆస్పత్రిలోకి ప్రవేశించిన దుండగుడు అక్కడున్న వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అడ్డు వచ్చిన వారిపైనా దాడి చేశాడు. ఈ ఘటనలో దాదాపు 23 మందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మరింత మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పారు. అనుమానితుడిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఇది కూడా చదవండి: Patnam Sunita Mahender Reddy: ప్రచారంలో దూసుకెళ్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డి..
ఈ ఘటనతో ఆస్పత్రి వాతావరణం రోధనలతో మిన్నంటాయి. రోగులు, సహాయ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. హఠాత్తు పరిణామంతో భీతిల్లిపోయారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. ఏ కారణంతో ఈ దాడులకు తెగబడ్డాడో విచారణ జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad Rains : భారీ వర్షానికి తడిసిముద్దైన హైదరాబాద్