Assam Floods: అస్సాంలో వరదల బీభత్సం.. 15కి చేరిన మరణాల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగిందని.. ప్రభావిత జనాభా సంఖ్య ఆరు లక్షలకు పైగా పెరిగిందని అధికారిక బులెటిన్ శనివారం తెలిపింది. శుక్రవారం నాటికి 11 జిల్లాల్లో బాధితుల సంఖ్య 3.5 లక్షలు అని పేర్కొంది. అయితే.. ప్రభావిత జిల్లాల సంఖ్య 10కి తగ్గిందని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విడుదల చేసింది. మే 28 నుండి 15 వరకు వరదలు, తుఫానుల కారణంగా కాచర్, హైలకండి, కరీంగంజ్ జిల్లాలలో ఒక్కొక్కరు మరణించారు. మూడు ప్రధాన నదులు.. కోపిలి, బరాక్, కుషియార ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని (ASDMA) బులెటిన్ తెలిపింది. ప్రభావిత జనాభా సంఖ్య 6,01,642కి చేరుకుందని.. నాగోన్ అత్యంత దెబ్బతిన్నదని.. 2,79,345 మంది వరదలో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొంది.
Etela: తెలంగాణలో బీజేపీ 10 స్థానాలు గెలవబోతుంది
Also Read
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
తీవ్రంగా దెబ్బతిన్న ఇతర జిల్లాలలో హోజాయ్ (1,26,813 ప్రభావిత జనాభా), కాచర్ (1,12,265) ఉన్నారు. వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 187 సహాయ శిబిరాల్లో మొత్తం 41,564 మంది నిర్వాసితులయ్యారు. NDRF, SDRF, స్థానిక పరిపాలన, ప్రజలు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నారు. శనివారం వరకు మొత్తం 966 మందిని, 89 జంతువులను రక్షించినట్లు అస్సాం పోలీసులు ట్విట్టర్ లో తెలిపారు. ‘రెమల్’ తుఫాను తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు మరియు రైలు కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
Postal Ballot: వైసీపీ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు… సుప్రీంకు వెళ్లే యోచన..
కాచర్ జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా.. శనివారం అన్ని విద్యా సంస్థలు మూసివేశారు. షెడ్యూల్ చేసిన సెమిస్టర్, కంపార్ట్మెంటల్ పరీక్షలు ప్రణాళికాబద్ధంగా జరుగుతాయని అధికారిక ప్రకటన తెలిపింది. మరోవైపు.. న్యూ హాఫ్లాంగ్లోని చంద్రనాథ్పూర్ సెక్షన్ మధ్య ట్రాక్ దెబ్బతినడం, లుమ్డింగ్ డివిజన్లోని సిల్చార్ స్టేషన్లో నీరు నిలిచిపోవడంతో.. శనివారం నుండి సోమవారం వరకు ప్రయాణం ప్రారంభించాల్సిన కనీసం 10 రైళ్లను రద్దు చేసినట్లు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి తెలిపారు.
తాజావార్తలు
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!