Assam Floods: అస్సాంలో వరదల బీభత్సం.. 15కి చేరిన మరణాల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగిందని.. ప్రభావిత జనాభా సంఖ్య ఆరు లక్షలకు పైగా పెరిగిందని అధికారిక బులెటిన్ శనివారం తెలిపింది. శుక్రవారం నాటికి 11 జిల్లాల్లో బాధితుల సంఖ్య 3.5 లక్షలు అని పేర్కొంది. అయితే.. ప్రభావిత జిల్లాల సంఖ్య 10కి తగ్గిందని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విడుదల చేసింది. మే 28 నుండి 15 వరకు వరదలు, తుఫానుల కారణంగా కాచర్, హైలకండి, కరీంగంజ్ జిల్లాలలో ఒక్కొక్కరు మరణించారు. మూడు ప్రధాన నదులు.. కోపిలి, బరాక్, కుషియార ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని (ASDMA) బులెటిన్ తెలిపింది. ప్రభావిత జనాభా సంఖ్య 6,01,642కి చేరుకుందని.. నాగోన్ అత్యంత దెబ్బతిన్నదని.. 2,79,345 మంది వరదలో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొంది.
Etela: తెలంగాణలో బీజేపీ 10 స్థానాలు గెలవబోతుంది
Also Read
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
తీవ్రంగా దెబ్బతిన్న ఇతర జిల్లాలలో హోజాయ్ (1,26,813 ప్రభావిత జనాభా), కాచర్ (1,12,265) ఉన్నారు. వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 187 సహాయ శిబిరాల్లో మొత్తం 41,564 మంది నిర్వాసితులయ్యారు. NDRF, SDRF, స్థానిక పరిపాలన, ప్రజలు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నారు. శనివారం వరకు మొత్తం 966 మందిని, 89 జంతువులను రక్షించినట్లు అస్సాం పోలీసులు ట్విట్టర్ లో తెలిపారు. ‘రెమల్’ తుఫాను తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు మరియు రైలు కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
Postal Ballot: వైసీపీ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు… సుప్రీంకు వెళ్లే యోచన..
కాచర్ జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా.. శనివారం అన్ని విద్యా సంస్థలు మూసివేశారు. షెడ్యూల్ చేసిన సెమిస్టర్, కంపార్ట్మెంటల్ పరీక్షలు ప్రణాళికాబద్ధంగా జరుగుతాయని అధికారిక ప్రకటన తెలిపింది. మరోవైపు.. న్యూ హాఫ్లాంగ్లోని చంద్రనాథ్పూర్ సెక్షన్ మధ్య ట్రాక్ దెబ్బతినడం, లుమ్డింగ్ డివిజన్లోని సిల్చార్ స్టేషన్లో నీరు నిలిచిపోవడంతో.. శనివారం నుండి సోమవారం వరకు ప్రయాణం ప్రారంభించాల్సిన కనీసం 10 రైళ్లను రద్దు చేసినట్లు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి తెలిపారు.
తాజావార్తలు
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!