Assam Floods: అస్సాంలో వరదల బీభత్సం.. 15కి చేరిన మరణాల సంఖ్య
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగిందని.. ప్రభావిత జనాభా సంఖ్య ఆరు లక్షలకు పైగా పెరిగిందని అధికారిక బులెటిన్ శనివారం తెలిపింది. శుక్రవారం నాటికి 11 జిల్లాల్లో బాధితుల సంఖ్య 3.5 లక్షలు అని పేర్కొంది. అయితే.. ప్రభావిత జిల్లాల సంఖ్య 10కి తగ్గిందని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విడుదల చేసింది. మే 28 నుండి 15 వరకు వరదలు, తుఫానుల కారణంగా కాచర్, హైలకండి, కరీంగంజ్ జిల్లాలలో ఒక్కొక్కరు మరణించారు. మూడు ప్రధాన నదులు.. కోపిలి, బరాక్, కుషియార ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని (ASDMA) బులెటిన్ తెలిపింది. ప్రభావిత జనాభా సంఖ్య 6,01,642కి చేరుకుందని.. నాగోన్ అత్యంత దెబ్బతిన్నదని.. 2,79,345 మంది వరదలో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొంది.
Etela: తెలంగాణలో బీజేపీ 10 స్థానాలు గెలవబోతుంది
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
తీవ్రంగా దెబ్బతిన్న ఇతర జిల్లాలలో హోజాయ్ (1,26,813 ప్రభావిత జనాభా), కాచర్ (1,12,265) ఉన్నారు. వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 187 సహాయ శిబిరాల్లో మొత్తం 41,564 మంది నిర్వాసితులయ్యారు. NDRF, SDRF, స్థానిక పరిపాలన, ప్రజలు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నారు. శనివారం వరకు మొత్తం 966 మందిని, 89 జంతువులను రక్షించినట్లు అస్సాం పోలీసులు ట్విట్టర్ లో తెలిపారు. ‘రెమల్’ తుఫాను తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు మరియు రైలు కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
Postal Ballot: వైసీపీ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు… సుప్రీంకు వెళ్లే యోచన..
కాచర్ జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా.. శనివారం అన్ని విద్యా సంస్థలు మూసివేశారు. షెడ్యూల్ చేసిన సెమిస్టర్, కంపార్ట్మెంటల్ పరీక్షలు ప్రణాళికాబద్ధంగా జరుగుతాయని అధికారిక ప్రకటన తెలిపింది. మరోవైపు.. న్యూ హాఫ్లాంగ్లోని చంద్రనాథ్పూర్ సెక్షన్ మధ్య ట్రాక్ దెబ్బతినడం, లుమ్డింగ్ డివిజన్లోని సిల్చార్ స్టేషన్లో నీరు నిలిచిపోవడంతో.. శనివారం నుండి సోమవారం వరకు ప్రయాణం ప్రారంభించాల్సిన కనీసం 10 రైళ్లను రద్దు చేసినట్లు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!