Assam Floods: అస్సాంలో వరదల బీభత్సం.. 15కి చేరిన మరణాల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగిందని.. ప్రభావిత జనాభా సంఖ్య ఆరు లక్షలకు పైగా పెరిగిందని అధికారిక బులెటిన్ శనివారం తెలిపింది. శుక్రవారం నాటికి 11 జిల్లాల్లో బాధితుల సంఖ్య 3.5 లక్షలు అని పేర్కొంది. అయితే.. ప్రభావిత జిల్లాల సంఖ్య 10కి తగ్గిందని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విడుదల చేసింది. మే 28 నుండి 15 వరకు వరదలు, తుఫానుల కారణంగా కాచర్, హైలకండి, కరీంగంజ్ జిల్లాలలో ఒక్కొక్కరు మరణించారు. మూడు ప్రధాన నదులు.. కోపిలి, బరాక్, కుషియార ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని (ASDMA) బులెటిన్ తెలిపింది. ప్రభావిత జనాభా సంఖ్య 6,01,642కి చేరుకుందని.. నాగోన్ అత్యంత దెబ్బతిన్నదని.. 2,79,345 మంది వరదలో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొంది.
Etela: తెలంగాణలో బీజేపీ 10 స్థానాలు గెలవబోతుంది
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
తీవ్రంగా దెబ్బతిన్న ఇతర జిల్లాలలో హోజాయ్ (1,26,813 ప్రభావిత జనాభా), కాచర్ (1,12,265) ఉన్నారు. వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 187 సహాయ శిబిరాల్లో మొత్తం 41,564 మంది నిర్వాసితులయ్యారు. NDRF, SDRF, స్థానిక పరిపాలన, ప్రజలు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నారు. శనివారం వరకు మొత్తం 966 మందిని, 89 జంతువులను రక్షించినట్లు అస్సాం పోలీసులు ట్విట్టర్ లో తెలిపారు. ‘రెమల్’ తుఫాను తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు మరియు రైలు కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
Postal Ballot: వైసీపీ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు… సుప్రీంకు వెళ్లే యోచన..
కాచర్ జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా.. శనివారం అన్ని విద్యా సంస్థలు మూసివేశారు. షెడ్యూల్ చేసిన సెమిస్టర్, కంపార్ట్మెంటల్ పరీక్షలు ప్రణాళికాబద్ధంగా జరుగుతాయని అధికారిక ప్రకటన తెలిపింది. మరోవైపు.. న్యూ హాఫ్లాంగ్లోని చంద్రనాథ్పూర్ సెక్షన్ మధ్య ట్రాక్ దెబ్బతినడం, లుమ్డింగ్ డివిజన్లోని సిల్చార్ స్టేషన్లో నీరు నిలిచిపోవడంతో.. శనివారం నుండి సోమవారం వరకు ప్రయాణం ప్రారంభించాల్సిన కనీసం 10 రైళ్లను రద్దు చేసినట్లు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి తెలిపారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!