Assam Floods: అస్సాంలో వరదల బీభత్సం.. 15కి చేరిన మరణాల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగిందని.. ప్రభావిత జనాభా సంఖ్య ఆరు లక్షలకు పైగా పెరిగిందని అధికారిక బులెటిన్ శనివారం తెలిపింది. శుక్రవారం నాటికి 11 జిల్లాల్లో బాధితుల సంఖ్య 3.5 లక్షలు అని పేర్కొంది. అయితే.. ప్రభావిత జిల్లాల సంఖ్య 10కి తగ్గిందని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విడుదల చేసింది. మే 28 నుండి 15 వరకు వరదలు, తుఫానుల కారణంగా కాచర్, హైలకండి, కరీంగంజ్ జిల్లాలలో ఒక్కొక్కరు మరణించారు. మూడు ప్రధాన నదులు.. కోపిలి, బరాక్, కుషియార ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని (ASDMA) బులెటిన్ తెలిపింది. ప్రభావిత జనాభా సంఖ్య 6,01,642కి చేరుకుందని.. నాగోన్ అత్యంత దెబ్బతిన్నదని.. 2,79,345 మంది వరదలో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొంది.
Etela: తెలంగాణలో బీజేపీ 10 స్థానాలు గెలవబోతుంది
Also Read
తీవ్రంగా దెబ్బతిన్న ఇతర జిల్లాలలో హోజాయ్ (1,26,813 ప్రభావిత జనాభా), కాచర్ (1,12,265) ఉన్నారు. వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 187 సహాయ శిబిరాల్లో మొత్తం 41,564 మంది నిర్వాసితులయ్యారు. NDRF, SDRF, స్థానిక పరిపాలన, ప్రజలు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నారు. శనివారం వరకు మొత్తం 966 మందిని, 89 జంతువులను రక్షించినట్లు అస్సాం పోలీసులు ట్విట్టర్ లో తెలిపారు. ‘రెమల్’ తుఫాను తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు మరియు రైలు కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
Postal Ballot: వైసీపీ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు… సుప్రీంకు వెళ్లే యోచన..
కాచర్ జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా.. శనివారం అన్ని విద్యా సంస్థలు మూసివేశారు. షెడ్యూల్ చేసిన సెమిస్టర్, కంపార్ట్మెంటల్ పరీక్షలు ప్రణాళికాబద్ధంగా జరుగుతాయని అధికారిక ప్రకటన తెలిపింది. మరోవైపు.. న్యూ హాఫ్లాంగ్లోని చంద్రనాథ్పూర్ సెక్షన్ మధ్య ట్రాక్ దెబ్బతినడం, లుమ్డింగ్ డివిజన్లోని సిల్చార్ స్టేషన్లో నీరు నిలిచిపోవడంతో.. శనివారం నుండి సోమవారం వరకు ప్రయాణం ప్రారంభించాల్సిన కనీసం 10 రైళ్లను రద్దు చేసినట్లు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి తెలిపారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!