Pakistan: పాకిస్థాన్లో బాంబు పేలుళ్లు.. ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లో రంజాన్ షాపింగ్లే లక్ష్యంగా ముష్కరులు రెచ్చిపోయారు. బలూచిస్థాన్లో ఉగ్రవాదులు ఘోరమైన పేలుళ్లకు తెగబడ్డారు. ఈ పేలుళ్లలో ముగ్గురు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒక పోలీసు కూడా ఉన్నారు. కుచ్లక్లోని మసీదు, ఖుజ్దార్ మార్కెట్ లక్ష్యంగా బాంబు దాడులు చోటుచేసుకున్నాయి. పేలుళ్లలో ఐఈడీలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏ గ్రూప్ కూడా పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.
ఈద్ షాపింగ్ కోసం మార్కెట్లో మహిళలు, పిల్లలతో జనసందోహం ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ పేలుడు ఒక పోలీస్తో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారని పేర్కొన్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. రిమోట్ కంట్రోల్తో బాంబు పేల్చినట్లు వెల్లించారు. ఇక పేలుళ్లకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు.
Also Read
- YS Jagan: డీఎస్సీ వివాదం.. లోకేష్ రాజీనామా.. సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
- Bonda Uma: త్రీమెన్ కమిటీ ముందుకు బోండా ఉమా.. తన వ్యాఖ్యలపై క్లారిటీ.. ప్రతి మాటకు రికార్డు ఉంది..!
- 8000mAh బ్యాటరీ, 7-అంగుళాల OLED డిస్ప్లే, 50MP కెమెరా.. Redmi నుంచి కొత్త ఫోన్ విడుదల తేదీ ఖరారు..
- Priyanka Gandhi: ‘‘ అత్యాచార నిందితులకు మద్దతు’’.. ప్రహ్లాద్ జోషిపై ప్రియాంకాగాంధీ సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విదేశీ పర్యటనలో ఉన్నారు. సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. పాకిస్థాన్ ప్రధానిగా రెండోసారి షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టాక.. ఇదే తొలి విదేశీ పర్యటన. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ అంశంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించడంతో పాటు, చారిత్రక సంబంధాలు, ద్వైపాక్షిక సహకారం మరియు వివిధ రంగాలలో మరింత అభివృద్ధికి అవకాశాలను సమీక్షించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీ వివాదం.. లోకేష్ రాజీనామా.. సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
-
Bonda Uma: త్రీమెన్ కమిటీ ముందుకు బోండా ఉమా.. తన వ్యాఖ్యలపై క్లారిటీ.. ప్రతి మాటకు రికార్డు ఉంది..!
-
8000mAh బ్యాటరీ, 7-అంగుళాల OLED డిస్ప్లే, 50MP కెమెరా.. Redmi నుంచి కొత్త ఫోన్ విడుదల తేదీ ఖరారు..
-
Priyanka Gandhi: ‘‘ అత్యాచార నిందితులకు మద్దతు’’.. ప్రహ్లాద్ జోషిపై ప్రియాంకాగాంధీ సంచలన వ్యాఖ్యలు..
-
Kalyana Lakshmi: కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ కోసం అడ్డదారులు.. గుట్టురట్టు చేసిన పోలీసులు..
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!