DCP Vineeth : చిట్ఫండ్ మోసాల పట్ల జనాల అప్రమత్తంగా ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాదాపూర్లోని సమతా మూర్తి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో సమత మూర్తి చిట్ ఫండ్ ఇద్దరు నిర్వాహకులు శ్రీనివాస్ రాకేష్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా మాదాపూర్ డీపీసీ వినీత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ.. మాదాపూర్ లో వేల్పుల శ్రీనివాస్ రాకేష్ గణేష్ డైరెక్టర్ లుగా ఏర్పడి సమత మూర్తి చిట్ ఫండ్ పేరుతో సంస్థ ఏర్పాటు చేశారన్నారు. ఎవరికైతే ఆర్థిక అవసరాలను చేసుకుని చిట్టి ద్వారా మోసాలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఖాతాదారులను మోసం చేయడం ద్వారా సుమారు ఐదు కోట్ల వరకు దండుకున్నారని ఆయన అన్నారు. దాదాపు ఇప్పటి వరకు 120 వరకు బాధితులు ఉన్నట్టు ఐడెంటిఫై చేసామని ఆయన తెలిపారు. ఇందులో కొంత మంది బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేసామని, ఇప్పటివరకు ఐదు కోట్ల మోసం జరిగింది విచారణలో మోసం విలువ పెరగవచ్చని ఆయన అన్నారు. శ్రీనివాస్ రాకేష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ చేసామని ఆయన తెలిపారు. మొబైల్ ఫోన్స్ సీజ్ చేసాం గణేష్ పరారీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు వారిని కూడా ఆదుపులోకి తీసుకుంటామని, అమాయకులకు డబ్బు ఆశ చూపి చిట్ఫండ్ నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. మాదాపూర్ జోన్లో ఇలాంటివి ఆరు కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. వాళ్లను కూడా అరెస్ట్ చేస్తామని, గత ఆరు నెలలుగా నిందితులు చిట్ఫండ్ సంస్థ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారన్నారు. మాదాపూర్ కూకట్పల్లి, ఎల్బీనగర్లో బ్రాంచెస్ ఓపెన్ చేశారని, తెలిసిన పరిచయస్తుల ద్వారా అలానే ఆన్లైన్ ద్వారా ఖాతాదారులను చేర్చుకున్నారన్నారు. నెలవారీగా డబ్బులు వచ్చే స్కీమ్స్ ఉన్నాయని ఖాతాదారులను నమ్మించారని, మొదట రెండు మూడు నెలలు సక్రమంగా డబ్బులు ఇచ్చి ఆపై మోసాలకు పాల్పడ్డారన్నారు. సమత మూర్తి పేరుతోపాటు చిన్న జీయర్ పేరు కూడా వాడారు వారికి ఈ చిట్ ఫండ్ కి ఎలాంటి సంబంధం లేదన్నారు. దోచుకున్న డబ్బు ఎక్కడ ఉందో సమాచారం ఉందని, బాధితులకు అప్పగించే ప్రయత్నం చేస్తామన్నారు. చిట్ఫండ్ మోసాల పట్ల జనాల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!