Dawood Ibrahim: గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం!.. పాకిస్థాన్లో ఇంటర్నెట్ డౌన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dawood Ibrahim: భారతదేశపు అతిపెద్ద శత్రువు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందన్న వార్త తర్వాత సోషల్ మీడియాలో అనేక వాదనలు జరుగుతున్నాయి. పాకిస్థాన్లో తలదాచుకున్న దావూద్ విషప్రయోగం చేశారన్న ఆరోపణలతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ట్విట్టర్ వేదికగా చాలా మంది దావూద్కు విషప్రయోగం చేశారని, ఆ తర్వాత అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు అతను చికిత్స సమయంలో మరణించాడని కూడా చెప్పటం గమనార్హం. దానిని పాకిస్తాన్ దాచిపెడదామనుకుంటుంది. అయితే, ఈ విషయాన్ని ఏ ప్రభుత్వ ఏజెన్సీ లేదా మీడియా ఇంకా ధృవీకరించలేదు.
Read Also: Breaking: రాష్ట్రాలకు కేంద్రం కొవిడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
దావూద్ హతమయ్యాడని చందన్ శర్మ అనే వినియోగదారు పేర్కొన్నాడు. దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నట్లయితే దానికి పాకిస్థాన్ రుజువు ఇవ్వాలని సదరు యూజర్ చెప్పాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అంతటా ఇంటర్నెట్ మూసివేయబడింది, సోషల్ మీడియా సరిగ్గా పనిచేయలేదు ఎందుకంటే పాకిస్థానీలు వార్తలను దాచవలసి ఉంటుంది. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషప్రయోగం వల్ల ఆసుపత్రి పాలయ్యారనే ఊహాగానాల మధ్య విశ్వసనీయ నిఘా వర్గాలు డిసెంబరు 17న సోషల్ మీడియాలో వచ్చిన ఈ పుకార్లను ఖండించాయి.
పాకిస్థాన్లో ఇంటర్నెట్ డౌన్..
దీంతో పాటు పాకిస్థాన్లోని పలు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఇంటర్నెట్ సేవలు పనిచేయడం లేదు. చాలా చోట్ల ఇంటర్నెట్ గణనీయంగా మందగించింది. దావూద్కు సంబంధించిన వార్తలను దాచేందుకే ఇంటర్నెట్ను నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇమ్రాన్ ఖాన్ వర్చువల్ ర్యాలీ కారణంగానే ఈ స్టెప్ తీసినట్లు కొందరు అంటున్నారు. పొరుగు దేశంలో ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. పాకిస్థాన్ మీడియాలో కూడా దావూద్పై విషప్రయోగం జరిగిందనే విషయం చర్చనీయాంశమైంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఇంటర్నెట్ను మూసేయాలని సూచించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!