Danish Malewar: దేశవాళీ క్రికెట్లో నయా సెన్సేషన్.. దులిప్ ట్రోఫీలో మలేవర్ సంచలన ఇన్నింగ్స్!
- దేశవాళీ క్రికెట్లో నయా సెన్సేషన్
- దులిప్ ట్రోఫీలో మలేవర్ సంచలన ఇన్నింగ్స్
- 219 బంతులు ఎదుర్కొని 198 పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవాళీ క్రికెట్లో నయా సెన్సేషన్. దులిప్ ట్రోఫీ టోర్నమెంట్లో బ్యాటర్ డానిష్ మలేవర్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. దులిప్ ట్రోఫీ తొలి క్వార్టర్ ఫైనల్లో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో సెంట్రల్ జోన్ బ్యాటర్ మలేవర్ డబుల్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచాడు. మొదటిరోజు ఆటలో 35 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 198 పరుగులు బాదాడు. రెండో రోజు అతడు డబుల్ సెంచరీ మార్క్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. విదర్భకు చెందిన మలేవర్ సహా కెప్టెన్ రజత్ పాటిదార్ (96 బంతుల్లో 125) చెలరేగడంతో సెంట్రల్ జోన్ మొదటి రోజు ఆట ముగిసేవరకు 77 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 432 రన్స్ చేసింది.
మొదటి రోజున 21 ఏళ్ల డానిష్ మలేవర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. 219 బంతులు ఎదుర్కొని 198 పరుగులు సాధించాడు. కెప్టెన్ రజత్ పాటిదార్తో కలిసి 174 బంతుల్లో 205 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ 2025లో మలేవర్ కేరళపై 153, 73 పరుగులు చేశాడు. దాంతో విదర్భ టైటిల్ గెలుచుకుంది. ఇప్పటివరకు మలేవర్ 10 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ల్లో 65.4 సగటుతో 981 పరుగులు చేశాడు. ఇటీవలే దేశవాళీ దిగ్గజం ఛతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. ఈ నేపథ్యంలో ‘నయా వాల్’ పుజారాకు వారసుడు వచ్చాడు అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మలేవర్ రైటార్మ్ బ్యాటర్ మాత్రమే కాకుండా.. లెగ్బ్రేక్ స్పిన్నర్ కూడా.
Also Read
- SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్ను..!
- FIFA World Cup: సెనెగల్పై 'కిలియన్ ఎంబాపే' డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
- Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
- Fake Currency Scam: రూపాయి ఇస్తే మూడు రూపాయలు.. నకిలీ నోట్ల ఆశతో 14 లక్షలు పోగొట్టుకున్న అన్నదమ్ములు!
Also Read: Asia Cup 2025: 15 మందిలో ఆ ముగ్గురే గేమ్ ఛేంజర్లు.. సెహ్వాగ్ లిస్టులో లేని స్టార్స్!
రజత్ పాటిదార్ కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 66వ ఓవర్లో ఫిరోజామ్ జోతిన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. పాటిదార్ 96 బంతుల్లో 130.20 స్ట్రైక్ రేట్తో 125 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. పాటిదార్ 69 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 4863 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు చేశాడు. మధ్యప్రదేశ్ తరపున పాటిదార్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. అక్టోబర్ 2015లో వడోదరపై తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. పాటిదార్ ఐపీఎల్ 2025లో ఆర్సీబీని విజేతగా నిలిపిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Microsoft Surface Pro: OLED డిస్ప్లే, 16GB RAM, ప్రీమియం ఫీచర్లతో.. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో ల్యాప్టాప్ విడుదల
-
SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్ను..!
-
FIFA World Cup: సెనెగల్పై ‘కిలియన్ ఎంబాపే’ డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ మూవీ స్టోరీ లీక్
-
Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!