MK Meena: ఉచిత ఇసుక అమలులో జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షించండి..
- ఉచిత ఇసుక అమలులో జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షించండి
- పట్టా భూముల నుండి ఇసుక సేకరణకు త్వరలో జీవో
- గనులు..అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Meena: ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ఉచిత ఇసుక పంపిణీ విషయంలో రోజువారీ సమీక్షలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. వర్షాకాలం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటే, తరువాతి కాలంలో ఇసుక లభ్యత పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ఆదేశాలతో శుక్రవారం జిల్లా కలెక్టర్లతో అమలులో ఉన్న ఉచిత ఇసుక విధానం, సెప్టెంబర్ 11వ తేదీ నుంచి రానున్న నూతన విధానాలపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గనుల శాఖ సంచాలకులు ప్రవీణ్ కుమార్ ఇబ్రహీంపట్నం కమిషనరేట్ నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. రాష్ట్ర స్దాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలోనే జిల్లా స్దాయిలో కూడా జిల్లా స్దాయి కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని మీనా ఆదేశించారు.
Read Also: AP CM Chandrababu: తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించేది లేదు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
కలెక్టర్లు ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు లోను కావాల్సిన అవసరం లేదని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారని. పట్టా భూముల నుంచి ఇసుక సేకరణకు త్వరలోనే జీవో ఇవ్వనున్నామని, రవాణా ఛార్జీలు మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ధర అమలులో ఉండేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఆన్లైన్ విధానంలో ఇసుక బుకింగ్ ప్రక్రియ ద్వారా ఎవరికి వారు తమ ఇంటి నుంచే బుక్ చేసుకుని, జీపీఎస్ విదానంలో తమ వాహనం లోకేషన్ను కూడా తెలుసుకోవచ్చన్నారు. ఆన్లైన్ విధానం పట్ల అవగాహన లేని గ్రామీణ ప్రాంతాల వారి కోసం సచివాలయంలో శిక్షణ పొందిన ఉద్యోగి అందుబాటులో ఉంటారన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఇసుక లభ్యత, ధరలపై నిత్యం మీడియాకు బులెటిన్ విడుదల చేయాలని మీనా అదేశించారు. జిల్లా స్థాయి వ్యవహారాలకు జాయింట్ కలెక్టర్ను బాధ్యునిగా చూస్తామన్నారు.
Read Also: AP CM Chandrababu: ప్రకృతి విపత్తులు పోవాలంటే చెట్లు నాటడమే ఏకైక మార్గం
గనుల శాఖ సంచాలకులు, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. త్వరలో అందుబాటులోకి రానున్న శాండ్ పోర్టల్ విభిన్న అంశాలకు మార్గనిర్దేశకత్వం వహిస్తుందన్నారు. సమస్త సమాచారాన్ని దానిలో అందుబాటులో ఉంచుతామన్నారు. రవాణా వాహనాల ఎంపానల్ మెంట్ను వేగంగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రతి రోజు ఇసుక పరిస్థితిపై సమీక్ష చేస్తున్నారని, సీఎం అకాంక్షల మేరకు పనిచేయవలసి ఉందన్నారు. వంద శాతం వినియోగదారులు ఇసుక రవాణా విషయంలో తమ సంతృప్తిని వ్యక్తం చేయటమే ధ్యేయంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వ్యవస్థలకు భిన్నంగా థర్డ్ పార్టీ ఫీడ్ బ్యాక్ను తీసుకుంటున్నామన్నారు. వీడియో కాన్సరెన్స్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, గనుల శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, ఏడీలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!